సుశాంత్ సహా ఆ ఇద్దరు హీరోయిన్లు.. ఆ హాస్పిటల్లోనే!
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం ఎన్నో అనుమానాలకు దారి తీస్తోంది. ముఖ్యంగా ఇండస్ట్రీలోని పరిస్థితులపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. నెపోటిజం కారణంగానే సుశాంత్ మరణించాడన్న ఆరోపణలు వినిపిస్తుండగా తాజాగా సుశాంత్ మరణాన్ని ధృవీకిరంచిన కూపర్ హాస్పిటల్ మీద కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు నెటిజెన్లు.
ఈ నెల 14న ముంబైలోని తన నివాసంలో సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తాను ఈ దారుణమైన నిర్ణయం తీసుకోవడానికి కారణాలను సుశాంత్ వెల్లడించకపోయినా అవకాశాలు చేజారిపోవటంతో ఇండస్ట్రీ ప్రముఖులు దూరం పెట్టడం లాంటి ఒత్తిడి కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తాజాగా మరో అంశం తెర మీదకు వచ్చింది. సుశాంత్ ఆత్మహత్య తరువాత ఆయన్ను పోస్ట్మార్టం నిమిత్తం కూపర్ హాస్పిటల్కు తరలించారు. అయితే ఆ హాస్పిటల్ తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఇలాగే అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన పర్వీన్ బాబీ, దివ్య భారతిలకు కూడా ఇదే హాస్పిటల్లో పోస్ట్మార్టం నిర్వహించారు.
కూపర్ హాస్పిటల్ ఇచ్చిన ధృవీకరించటంతోనే ముంబై పోలీసులు వారి మరణాలను ఆత్మహత్యలుగా ధృవీకరించారు. దీంతో అనుమానస్పద ఆత్మహత్యల విషయంలో కూపర్ హాస్పిటల్ తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయమై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి.
సౌత్ సినిమాలతో ఎంట్రీ ఇచ్చి తరువాత బాలీవుడ్లో సత్తా చాటిన అందాల భామ దివ్య భారతి. 1993 ఏప్రిల్ 5న ఈ భామ అనూహ్య పరిస్థితుల్లో ముంబై అంధేరిలోని తన ఇంటి కిటికీ లోంచి పడి చనిపోయింది. ఇంట్లో పార్టీ జరగుతుండగా తాను ప్రమాద వశాత్తు పడిపోయిందని అప్పట్లో ప్రచారం జరిగింది. కూపర్ హాస్పిటల్ దివ్య భారతీ మృతి ప్రమాదం అని ధృవీకరించింది.
పర్వీన్ బాబీ మృతి విషయంలోనూ ఇలాంటి పరిస్థితులు జరిగాయి. ఆమె మరణించిన 72 గంటల తరువాత ఆమె మృతదేహాన్ని గుర్తించారు. 2003 జనవరి 22న ఆమె మరణించినట్టుగా కూపర్ హాస్పిటల్ డాక్టర్లు ధృవీకరించారు. అయితే ఆమె మరణంపై ఎన్నో అనుమానాలు ఇప్పటికీ ఉన్నాయి. తాజాగా సుశాంత్ది కూడా ఆత్మహత్య అనే ఇదే హాస్పిటల్ ధృవీకరించటంతో అనుమానాలు బలపడుతున్నాయి.