నయన్ పెళ్లి ఆలస్యానికి కారణం అదే.. జ్యోతిష్యుడి సూచనలతో!
లేడీ సూపర్ స్టార్ నయనతార పెళ్లికి సంబంధించిన వార్తలు చాలా రోజులుగా ప్రచారంలో ఉన్నాయి. గత డిసెంబర్ నుంచే నయన్ పెళ్లికి ముహూర్తం వెతికే పనిలో ఉన్నట్టుగా వార్తలు వచ్చినా.. ఎప్పటికప్పుడూ వాయిదా పడుతూనే వచ్చింది. అయితే జాతక సమస్యల కారణంగానే ఓ జ్యోతిష్యుడి సూచనల మేరకు నయన్ పెళ్లి విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుందన్న టాక్ వినిపిస్తోంది.
సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో సూపర్ ఫేమస్ అయిన హాట్ కపుల్ నయనతార, విఘ్నేష్ శివన్. కొద్ది రోజులుగా వీరి పెళ్లికి సంబంధించిన వార్తలు మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అవుతున్నాాయి. కానీ ఇంత వరకు పెళ్లి మాత్రం జరగలేదు.
ఒక సంవత్సర కాలం నుంచి నయన్ పెళ్లి వార్త మీడియా హెడ్లైన్స్లో వినిపిస్తోంది. ముందుగా 2019 డిసెంబర్లో పెళ్లి చేసుకుంటారన్న ప్రచారం జరిగింది. తరువాత 2020 సమ్మర్ జరుగుతుందన్న టాక్ వినిపించింది.
టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం గత ఏడాది కాలంలో నయన్, విఘ్నేష్లు అనేక దేవాలయాలను సందర్శించారు. అయితే ఇలా ఆలయాలు సందర్శించటం పెళ్లి కోసమే అని భావిస్తున్నారు విశ్లేషకులు. దోశ నివారణ కోసం ఓ జోతిష్యుడి సలహా మేరకు నయన్, విఘ్నేష్ ల జంట ఆలయాలను సందర్శిస్తున్నారట.
నయనతార ఆస్ట్రాలజీని బాగా నమ్ముతుందట. అందుకే జ్యోతిష్యుడి సూచనల మేరకు వరుసగా ఆలయాలను సందర్శిస్తున్నట్టుగా చెబుతున్నారు. త్వరలో ఈ జంట కుంభకోణం సమీపంలో తిరు నాగేశ్వరం లోని రాహు ఆలయాన్ని సందర్శించనున్నారట. ఈ ఆలయ సందర్శన తరువాత పెళ్లికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.
కొద్ది రోజుల క్రితమే రాహు ఆలయాన్ని కూడా సందర్శించాల్సి ఉన్నా.. లాక్ డౌన్ కారణంగా దర్శనానికి వెళ్లలేకపోయారు. ప్రస్తుతం ఆలయాలు తిరిగి ఓపెన కావటంతో త్వరలోనే రాహు ఆలయ సందర్శనకు రెడీ అవుతున్నారు. దీంతో తమ జాతకంలోని దోశలకు పరిహారం కలుగుతుందని తరువాత పెళ్లి చేసుకోనున్నట్టుగా తెలుస్తోంది.