లక్ష్మీ పార్వతి ఒక శని, క్యారెక్టర్ లెస్..బ్రీత్ మూవీ ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ మనవడు డైరెక్ట్ అటాక్
లక్ష్మి పార్వతిపై ఎన్టీఆర్ మనవడు నందమూరి చైతన్య కృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. నందమూరి ఫ్యామిలీ ఎప్పుడూ లక్ష్మి పార్వతిని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేయడం చూస్తూనే ఉన్నాం.
లక్ష్మి పార్వతిపై ఎన్టీఆర్ మనవడు నందమూరి చైతన్య కృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. నందమూరి ఫ్యామిలీ ఎప్పుడూ లక్ష్మి పార్వతిని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేయడం చూస్తూనే ఉన్నాం. అయితే నందమూరి చైతన్య కృష్ణ డైరెక్ట్ గానే లక్ష్మి పార్వతిపై అటాక్ చేశాడు.
![article_image2](https://static-ai.asianetnews.com/images/01hfvd8yb6vsdjbxwtna84v6tf/5-jpg_300x216xt.jpg)
ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ తనయుడే నందమూరి చైతన్య కృష్ణ. చైతన్య కృష్ణ గతంలో రెండు దశాబ్దాల క్రితమే టాలీవుడ్ లో నటుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఆ సమయంలో చైతన్య కృష్ణ సక్సెస్ కాలేదు.
ఇప్పుడు చైతన్య కృష్ణ తనని తానూ రీ లాంచ్ చేసుకుంటూ బ్రీత్ అనే థ్రిల్లర్ మూవీతో వచ్చేస్తున్నాడు. డిసెంబర్ 2న ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా చైతన్య కృష్ణ లక్ష్మి పార్వతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వెన్ను పోటుపొడిచారు అనే ఆరోపణలపై చైతన్య కృష్ణ తనదైన శైలిలో స్పందించారు.
అనకూడదు కానీ ఆమె రావడం వల్ల మా కుటుంబానికి మంచి జరగలేదు. లక్ష్మి పార్వతి మా ఫ్యామిలీలో ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటుంది. ఆ సమయంలో ఆమెకి పార్టీని లాగేసుకునే చెడు ఉద్దేశం ఉండేది. డైరెక్ట్ గానే చెబుతున్నాయా ఆమె మా ఫ్యామిలీలోకి వచ్చిన శని. చాలా మంది మావయ్య చంద్రబాబు మీద కామెంట్స్ చేస్తుంటారు. కానీ అది నిజం కాదు.
పార్టీని కాపాడడం కోసమే మావయ్య ఆ రోజు ఆ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కోసమే ఎన్టీఆర్ గారికి చంద్రబాబు ఎదురుతిరిగారు. అప్పడు బాలకృష్ణ గారు కానీ, హరికృష్ణ గారు కానీ చంద్రబాబు వైపు ఉన్నారు. తప్పని పరిస్థితుల్లో మా నాన్న తాతగారివైపు ఉన్నారు. లక్షి పార్వతి అంటే మా నాన్నకి కూడా ఇష్టం లేదు. ఆమె క్యారెక్టర్ లెస్ లేడీ. ఆడది కాదు. ఒక శనిలా వచ్చిందిఅంటూ చైతన్య కృష్ణ తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.
చంద్రబాబు గారు చేసింది వెన్నుపోటు కాదు. ఒక మంచి పార్టీ ఆమె వల్ల నాశనం అయిపోతుంది అనే ఉద్దేశంతో ఎమ్మెల్యేలే చంద్రబాబు గారి వైపు వచ్చారు అంటూ చైతన్య కృష్ణ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.