- Home
- Entertainment
- బాలయ్య, నాగార్జున మధ్య విభేదాలు మరోసారి బట్టబయలు, పద్మభూషణ్ పురస్కారంపై స్పందించని నాగ్?
బాలయ్య, నాగార్జున మధ్య విభేదాలు మరోసారి బట్టబయలు, పద్మభూషణ్ పురస్కారంపై స్పందించని నాగ్?
బాలకృష్ణ, నాగార్జున మధ్య విభేదాలున్నాయనేది చాలా కాలంగా వినిపిస్తున్న రూమర్. ఇప్పుడు అది మరోసారి బట్టబయలు అయ్యింది. బాలయ్యకి నాగ్ విషెస్ చెప్పకపోవడం హాట్ టాపిక్ అవుతుంది.

బాలకృష్ణ, నాగార్జున మధ్య బయటకు తెలియని మిస్టరీ ఏదో రన్ అవుతుందనిపిస్తుంది. ఇది ఇండస్ట్రీలో, బయట నడిచే ప్రచారం. ఇద్దరూ ఫ్రీగా ఉండకపోవడమే దీనికి కారణం. ఇద్దరి మధ్య విభేదాలున్నాయనే వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. మధ్యలో సుబ్బరామిరెడ్డి అవార్డు ఫంక్షన్లో ఇద్దరు కలిశారు. విభేదాలే లేవని చెప్పారు. కానీ ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ అలా కలిసింది లేదు. దీంతో ఇద్దరి మధ్య ఏదో ఉందనే రూమర్స్ తరచూ వినిపిస్తూనే ఉన్నాయి.
ఇప్పుడు మరోసారి ఆ విషయం బయటపడింది. బాలయ్యకి ప్రతిష్టాత్మక పద్మ భూషణ్ పురస్కారం వచ్చిన వేళ ఈ విషయం బట్టబయలు అయ్యింది. ఎందుకంటే బాలకృష్ణకి ఇండస్ట్రీ నుంచి అందరు విషెస్ చెప్పారు. ఆయన సినిమా పరిశ్రమకి చేసిన సేవలకుగానూ, అలాగే ప్రజలకు ఎమ్మెల్యేగా అందిస్తున్న సేవలకుగానూ ఇది సరైన గుర్తింపుగా అభివర్ణించారు.
చిరంజీవి, వెంకటేష్, మోహన్బాబు, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, చరణ్, అల్లు అర్జున్, రవితేజ ఇలా పెద్ద హీరోల నుంచి, చిన్న హీరోల వరకు చాలా మంది విషెస్ చెప్పారు. హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు కూడా ఆయనకు అభినందనలు తెలిపారు.
అయితే నాగార్జున మాత్రం చెప్పలేదు(ఇప్పటి వరకు). ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇదే వీరి మధ్య విభేదాలు ఉన్నాయనేది నిరూపితమయ్యింది. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ సమకాలీకులు. వీరిలో ఈ అత్యున్నత పురస్కారాలు చిరంజీవి, బాలయ్యలకే వచ్చాయి. అలాగే మోహన్బాబుకి పద్మ శ్రీ వరించింది. కానీ వెంకటేష్, నాగార్జులకు ఎలాంటి పద్మ అవార్డులు రాలేదు.
ఈ క్రమంలో తమ పట్ల చిన్న చూపు, తమని గుర్తించలేదనే కోణంలో కూడా నాగార్జున బాలయ్యకి విషెస్ చెప్పకుండా ఉండి ఉంటారు. అంతేకాదు ఆయన ఎవరికీ విషెస్ చెప్పలేదు. అయితే నేడు రిపబ్లిక్ డే సందర్భంగా మాత్రం ఆయన అభిమానులు, ప్రజలకు విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు.
read more: `గేమ్ ఛేంజర్`లో రామ్ చరణ్ యాక్టింగ్ కి ఫ్యాన్స్ ఫిదా అయిన సీన్లు ఏంటంటే? వైరల్
ఈ పరిణామాలు బాలయ్య, నాగార్జున మధ్య విభేదాలను తట్టిలేపుతున్నాయి. విభేదాలు ఉన్నాయనే విషయాన్ని చాటి చెబుతున్నాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు మాత్రం ఈ విషయాన్ని నోటీస్ చేస్తున్నారు. మరి నిజంగానే విభేదాలు ఉన్నాయా? మరే కారణంతో అయినా నాగ్ దీనికి దూరంగా ఉన్నాడా? అనేది ఆసక్తికరం.
ఇదిలా ఉంటే ఈ సారి పద్మ అవార్డుల్లో తెలుగు వారికి అన్యాయం జరిగిందని, తెలంగాణ వారికి అన్యాయం జరిగిందనే కామెంట్ వినిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో అసహనం వ్యక్తం చేశారు.
ఇక బాలకృష్ణ ఇటీవల `డాకు మహారాజ్`తో విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు `అఖండ 2`లో నటిస్తున్నారు. అలాగే నాగార్జున చివరగా `నా సామిరంగ` సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఇప్పుడు ఆయన `కూలీ`, `కుబేర` చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇవి ఈ ఏడాది ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాయి. సోలో హీరోగా ఇంకా మరే సినిమాని ప్రకటించలేదు నాగ్.
read more:బాలయ్య కంటే ముందు పద్మభూషణ్ గౌరవం పొందిన తెలుగు హీరోలు ఎవరో తెలుసా..?
also read: బాలకృష్ణకి పద్మభూషణ్ పురస్కారంపై ఎన్టీఆర్ పోస్ట్.. బాబాయ్ గురించి అబ్బాయిలు ఏమన్నాడంటే?