నాగార్జున హీరోయిన్ దియా మీర్జా సెకండ్ మ్యారేజ్ నేడే.. వైరల్ అవుతున్న మెహందీ ఫోటోస్
నాగార్జున `వైల్డ్ డాగ్` హీరోయిన్ దియా మీర్జా రెండో పెళ్లి చేసుకోబోతుంది. ముంబయికి చెందిన బిజినెస్మ్యాన్ వైభవ్ రేఖీని ఈ రోజు(ఫిబ్రవరి 15)న మ్యారేజ్ చేసుకుంది. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం మెహందీ ఫంక్షన్ జరిగింది. ఇందులో వైట్ డ్రెస్లో ఆకట్టుకుంటుంది దియా. మరోవైపు తనకు కాబోయే భర్తతో కలిసి పోజులిచ్చింది.
దియా మీర్జా మెహందీ ఫంక్షన్ ముంబయిలోని తన నివాసంలో సింపుల్గా జరిగింది. ఇందులో దియాకి చెందిన కొంది మంది ఫ్రెండ్స్, బంధువులు పాల్గొన్నారు.
దియా ముంబయికి చెందిన వ్యాపారవేత్త వైభవ్ రేఖీని వివాహం చేసుకోబోతుంది. ఈ రోజు(సోమవారం) వీరి మ్యారేజ్ జరుగనుంది.
ఇప్పటికే దియా మీర్జా ముంబయికి చెందిన బిజినెస్ మ్యాన్ సాహిల్ సంఘాని వివాహం చేసుకుంది. 2019లో విడాకులు తీసుకున్నారు. ఇన్నాళ్లు ఒంటరిగా ఉన్న ఈ అమ్మడు ఇప్పుడు రెండో పెళ్లికి సిద్ధమైంది.
బాలీవుడ్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది దియా మీర్జా. పలు భారీ చిత్రాల్లో నటించి మెప్పించింది. సెలక్టీవ్గా సినిమాలు చేస్తూ రాణిస్తుంది.
ప్రస్తుతం తెలుగులో నాగార్జున హీరోగా నటిస్తున్న `వైల్డ్ డాగ్`లో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తుందీ అమ్మడు.
ఇప్పుడు పెళ్లి బంధంతో మరోసారి వైవాహిక జీవితాన్ని పున ప్రారంభించబోతుండటం విశేషం.
దియా మీర్జా మెహందీ ఫోటో..
దియా మ్యారేజ్ సందర్భంగా తానుండే ప్రదేశంలో బాడీగార్డ్ తో సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. కరోనా కారణంగా కొద్ది మంది బంధుమిత్రులతో వీరి వివాహం జరుగనుంది.