మరోసారి బిజినెస్మేన్ని మ్యారేజ్ చేసుకోబోతున్న నాగ్ హీరోయిన్ దియా మీర్జా ?
నటి దియా మీర్జా తన భర్తకి విడాకులిచ్చి రెండేళ్లు అవుతుంది. అయితే మరోసారి ఆమె ప్రేమలో పడ్డట్టు తెలుస్తుంది. మరోసారి వ్యాపారవేత్తని మ్యారేజ్ చేసుకునేందుకు రెడీ అవుతుందట. త్వరలోనే వీరిద్దరి పెళ్లిపీటలెక్కబోతున్నారని వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వినిపిస్తుంది.
దియా మీర్జా ముంబయికి చెందిన వ్యాపారవేత్త వైభవ్ రేఖీని వివాహం చేసుకోబోతున్నారట. ఈ నెల 15న వీరి మ్యారేజ్ ఫిక్స్ అయ్యిందనే ప్రచారం జరుగుతుంది.
ఈ మ్యారేజ్కి కేవలం రెండు కుటుంబాలకు చెందిన బంధుమిత్రులు మాత్రమే హాజరవుతారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ బాలీవుడ్లో వినిపిస్తుంది.
దీంతో దియా మీర్జా మళ్లీ పెళ్లి చేసుకోబోతుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి కన్ఫమేషన్ లేదు. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాలంటే మరో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే.
ఇదిలా ఉంటే దియా మీర్జా గతంలో ముంబయికి చెందిన వ్యాపారవేత్త సాహిల్ సంఘాతో చాలా రోజులు డేటింగ్ చేసి 2014లో వివాహం చేసుకున్నారు.
ఐదేళ్ల తర్వాత 2019లో విడిపోయారు. తాము స్నేహపూర్వకంగానే విడిపోతున్నట్టు వెల్లడించారు.
అనంతరం ఇటీవల మరో వ్యాపార వేత్త అయిన వైభవ్తో చనువుగా ఉంటున్నట్టు, వీరి మరో రెండు రోజుల్లో వివాహం చేసుకోబోతున్నట్టు ప్రస్తుతం వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
1999లో `ఎన్ స్వాసా కత్రే` చిత్రంలో డాన్స్ గా తన కెరీర్ని ప్రారంభించింది దియా. ఆ తర్వాత `రిహానా హై తెర్రే దిల్ మెయిన్` చిత్రంతో హీరోయిన్గా మారింది.
`దీవానపన్`, `తుమ్కో నా భూల్ పాయేంగే`, `తేజీబ్`, `దమ్`, `అలాగ్`, `పరిణీతి`, `దస్`, `లగే రహో మున్నా భాయ్`, `షూట్ ఔట్ ఎట్ లోఖండ్వాలా`, `కిసాన్`, `జై వీర్`, `లవ్ బ్రేకప్ జిందగీ, `సంజు`, `తాపడ్` చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ `వైల్డ్ డాగ్` చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు పలు వెబ్ సిరీస్లు చేస్తూ బిజీగా ఉంది దియా మీర్జా.