సింహం అవతారం ఎత్తిన నాగబాబు... ఎవరిని బెదిరిస్తున్నారో తెలియడం లేదే!
గత రెండేళ్లుగా నాగబాబు తీరు పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు జబర్ధస్త్ షోలో జడ్జిగా కూర్చున్నామా... నాలుగు నవ్వులు నవ్వామా, మన రెమ్యూనరేషన్ మనం తీసుకున్నామా... అన్నట్లు ఆయన తీరుండేది. ప్రస్తుతం ఆయన సోషల్ మీడియా జీవి, పార్టియల్ పొలిటీషియన్.
మెగా ఫ్యామిలీపై ఎవరు ఎలాంటి ఆరోపణలు చేసినా వాళ్లకు కౌంటర్ ఇచ్చే బాధ్యత నాగబాబు తీసుకుంటున్నారు. దీనికి కోసమే ఓ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన నాగబాబు... ప్రస్తుతం దానిని ఆదాయ వనరుగా కూడా మార్చుకున్నారు.
తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కామెడీ షోస్ నుండి సోషల్ అండ్ ఎకనమిక్ మరియు పొలిటికల్ టాపిక్స్ డిస్కస్ చేస్తున్నాడు. ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ లో చాలా యాక్టీవ్ గా ఉంటున్నారు ఆయన.
అప్పుడప్పుడూ ఆర్టిస్ట్ గా కూడా మారిపోతున్నాడు నాగబాబు. తనకు పెయింటింగ్ కూడా వచ్చని.. కుంచెతో కొన్ని కళా ఖండాలు ఆవిష్కరిస్తున్నారు.
జబర్ధస్త్ షోలో ఏళ్ల తరబడి జడ్జిగా చేసిన నాగబాబు ఆర్ధిక బాధల నుండి బయటపడి నిలదొక్కుకున్నారు. వరుణ్ కూడా కోట్లు పారితోషికం తీసుకునే హీరోగా ఎదగడంతో నాగబాబుకు డబ్బుల ఇబ్బందులు తప్పిపోయాయి.
కుటుంబ బాధ్యలు తీరడంతో నచ్చిన పనులు చేస్తూ... తన గురించి ప్రేక్షకులకు తెలియని కొత్త విషయాలు చెప్పాలని అనుకుంటున్నాడు.
తాజాగా నాగబాబు తనని తాను సింహంతో పోల్చుకుంటున్నాడు. కోరమీసం తో కొత్త లుక్ లో దిగిన ఫోటో పోస్ట్ చేయడంతో పాటు బలమైన, బరువైన కొటేషన్స్ కొడుతున్నాడు.
బనియన్ ధరించి భుజంపై ఉన్న సింహం టాటూ ప్రదరిస్తూ... సింహం కింగ్ కావడానికి కారణం దాని సైజు, వేగం, బలం కాదని యాటిట్యూడ్ అంటూ కామెంట్ పెట్టాడు.
నేడు మరో ఫోటో పంచుకున్న నాగబాబు... పడినా లేచినా సింహం సేమ్ యాటిట్యూడ్ మైంటైన్ చేస్తుందనే, అర్థం వచ్చేలా మరో కోట్ చేశాడు.
సడన్ గా నాగబాబు తన యాటిట్యూడ్ సింహంతో పోల్చుతూ... గంభీరమైన లుక్ లో ఫోటోలు ఎందుకు పెడుతున్నాడో, ఎవరికి సందేశం పంపుతున్నాడో అర్థం కావడం లేదు.