సాయిపల్లవితో వరుణ్తేజ్ పెళ్లి చేస్తా అన్న నెటిజన్.. బ్రహ్మానందంతో దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నాగబాబు
వరుణ్ తేజ్, సాయిపల్లవి పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. నెటిజన్లు వీరిద్దరికి పెళ్లి చేయండి అని పోస్టులు, మీమ్స్ పెడుతున్నారు. తాజాగా దీనిపై నాగబాబు స్పందించారు. `జాతిరత్నాలు`లోని బ్రహ్మానందంతో ముడిపెట్టాడు.
నాగబాబు తనయ, మెగా డాటర్ నిహారిక మ్యారేజ్ గతేడాది డిసెంబర్లో జరిగింది. దీంతో నాగబాబు రిలాక్స్ అయ్యారు. కూతురు మ్యారేజ్ అయిపోయింది కదా, ఇక వరుణ్ తేజ్ మ్యారేజ్ నెమ్మదిగా చేద్దాం లే అనుకున్నాడు.
కానీ అభిమానులు ఆగేలా లేరు. వరుణ్ తేజ్ మ్యారేజ్ ఎప్పుడు సర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇటీవల ఆయన అభిమానులతో చేసిన ఛాటింగ్లో కూడా ఆయనకు ఇదే ప్రశ్నలు ఎదురయ్యాయి. మంచి అమ్మాయి ఉంటే చూడండి అని వాళ్లకే ఆఫర్ ఇచ్చారు నాగబాబు.
అయితే కొంతమంది అభిమానుల మరింత అత్యుత్సాహం చూపించారు. వరుణ్ ఓ మిడిల్ క్లాస్ అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకుని వస్తే మీకు ఓకేనా? అని ప్రశ్నించగా, మీకు ఓకే అయినా నాకు ఓకే అని చెప్పాడు నాగబాబు.
తాజాగా మరోసారి ఆయన వరుణ్ తేజ్ మ్యారేజ్ ప్రశ్న ఎదురయ్యింది. అయితే ఈ సారి సాయిపల్లవితో లింక్ పెట్టి పోస్ట్ చేశారు. వీరిద్దరు ప్రేమలో ఉన్నారని, వరుణ్ తేజ్, సాయిపల్లవితో పెళ్లి చేస్తా సర్.. జోడి బాగుంటుంది` అంటూ కామెంట్ పెట్టాడో నెటిజన్.
దీనికి నాగబాబు స్పందించారు. అదిరిపోయేలా ఫన్నీ కౌంటర్ ఇచ్చారు. ఇందులో బ్రహ్మానందాన్ని తీసుకొచ్చాడు. `జాతిరత్నాలు` సినిమాలోని క్లైమాక్స్లో వచ్చే కోర్టు సీన్ వీడియోను పోస్ట్ చేసి షాకిచ్చారు.
ఆ కోర్ట్ సీన్లో జడ్జ్గా ఉన్న బ్రహ్మానందం 'తీర్పు కూడా మీరే చెప్పుకోండ్రా. ఇక, నేనేందుకు ఇక్కడి నుంచి వెళ్లిపోతాలే' అనే డైలాగ్ చెబుతారు. ఇదే వీడియో నాగబాబు పోస్ట్ చేశారు. నాగబాబు ఫన్నీ రిప్లై ఇప్పుడు సోషల్ మీడిమాలో వైరల్ అయింది.
వరుణ్ తేజ్, సాయిపల్లవి `ఫిదా` చిత్రంలో నటించారు. ఇది బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ చిత్రంతోనే తెలుగు ఆడియెన్స్ ని ఫిదా చేసింది సాయిపల్లవి.