- Home
- Entertainment
- అఖిల్కి తనకు ఏజ్ గ్యాప్ పై నాగచైతన్య షాకింగ్ కామెంట్స్.. ఇంట్లో డిస్కషన్పై ఓపెన్
అఖిల్కి తనకు ఏజ్ గ్యాప్ పై నాగచైతన్య షాకింగ్ కామెంట్స్.. ఇంట్లో డిస్కషన్పై ఓపెన్
అక్కినేని నాగచైతన్య.. తన తమ్ముడు అఖిల్పై స్పందించారు. ఆయన సినిమాపై, ఇద్దరి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల `లవ్ స్టోరి`, `బంగార్రాజు` చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ ఆకట్టుకున్నారు నాగచైతన్య(Naga Chaitanya). వరుస విజయాల అనంతరం ఇప్పుడాయన `థ్యాంక్యూ` (Thank You) చిత్రంతో రాబోతున్నారు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాశీఖన్నా(Raashi Khanna) కథానాయికగా నటించింది. దిల్రాజు నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 22న విడుదలైంది. చిత్ర ప్రమోషన్ లో భాగంగా నాగచైతన్యతో మాట్లాడుతూ, తమ్ముడు అఖిల్ గురించి స్పందించారు.
అఖిల్(Akhil)కి, తనకు చాలా ఏజ్ గ్యాప్ ఉందన్నారు. ఏజ్లో ఆరేడు ఏళ్లు గ్యాప్ ఉందని, దీంతో ఆలోచనలు భిన్నంగా ఉంటాయన్నారు. తనకు ఆలోచన విధానం, అఖిల్ ది పూర్తి భిన్నంగా ఉంటుందని, అందుకే కథల విషయంలో చర్చించుకుంటామని తెలిపారు చైతూ. తను ఎంపిక చేసుకునే కథలను తనతో చర్చిస్తారని, ఇప్పుడి కుర్రాళ్లు ఏం ఆలోచిస్తున్నారో తనకు తెలుస్తుందని, తన ఆలోచనలను తాను పంచుకుంటానని తెలిపారు.
ఇక అఖిల్ నటించిన `ఏజెంట్`(Agent)పై చెబుతూ, `ఏజెంట్` టీజర్ అద్భుతంగా ఉందని, సినిమా కోసం చాలా కష్టపడ్డాడని తెలిపారు చైతూ. అఖిల్కి మంచి బ్రేక్నిస్తుందన్నారు. ఈసందర్భంగా చిత్ర బృందంపై, టీజర్పై నాగచైతన్య ప్రశంసలు కురిపించారు. సినిమా కోసం వెయిట్ చేస్తున్నట్టు తెలిపారు. మరోవైపు తన `థ్యాంక్యూ` చిత్రం గురించి చెబుతూ, మన జీవితంలో ప్రతి దశలోనూ థ్యాంక్యూ చెప్పాల్సిన వాళ్లు చాలా మంది ఉంటారని, దాని ప్రాముఖ్యతని తెలిపే చిత్రమిదన్నారు.
అభిరామ్ అనే వ్యక్తి లైఫ్ జర్నీని తెలియజేస్తుందని, లుక్ వైజ్గా మూడు గెటప్ల్లో కనిపిస్తానని, కానీ అంతర్లీనంగా చాలా లేయర్స్ ఉంటాయన్నారు. లవ్తోపాటు ఎమోషన్స్ బలంగా ఉంటాయని, సినిమా ప్రారంభమైన పది నిమిషాలకే అభి పాత్రతో ట్రావెల్ అవుతారని, ఆయన ఎమోషనల్ జర్నీ స్టార్ట్ అవుతుందన్నారు. విక్రమ్ కుమార్ సినిమాని బాగా డిజైన్ చేశారని, ఆయన మనకు సీన్లు వివరించేటప్పుడే ఎలా యాక్ట్ చేయాలనేది క్లారిటీ వస్తుందని, ప్రత్యేకంగా కేర్ తీసుకోవాల్సిన పనిలేదన్నారు.
ఇటీవల ఇండస్ట్రీలో వస్తోన్న మార్పులపై నాగచైతన్య మాట్లాడుతూ, కరోనా తర్వాత ఇండస్ట్రీలో చాలా మార్పులొచ్చాయన్నారు. ముఖ్యంగా ఆడియెన్స్ చాలా మారారని, ఓటీటీలోకి సినిమా రావడంతో చాలా ఎడ్యూకేట్ అయ్యారని, చాలా కంటెంట్ని ఓటీటీల ద్వారా చూస్తున్నారని చెప్పారు. దీంతో దాన్ని కాదని, వాటిని దాటుకుని థియేటర్కి ఆడియెన్స్ ని తీసుకురావాలంటే ఇంకా చాలా చేయాలని, ఎగ్జైటింగ్ ఎలిమెంట్స్ జోడించాలని, మామూలు స్టఫ్ సరిపోదన్నారు. యాక్షన్, ఎమోషన్స్, పాటలే కాదు, బలమైన కథ ముఖ్యమన్నారు. కంటెంట్ ఈజ్ కింగ్ అని చెప్పారు. ఆడియెన్స్ ని బట్టి తాను కూడా మారానని, అలాంటి కథలకే ప్రయారిటీ ఇస్తున్నానని తెలిపారు.
నెక్ట్స్ వెంకట్ ప్రభుతో సినిమా ఉంటుందన్నారు. అందులో తాను పోలీస్ పాత్రలో కనిపిస్తానని, ఇది బైలింగ్వల్గా చేస్తున్నట్టు తెలిపారు. ఆగస్ట్ లో షూటింగ్ స్టార్ట్ అవుతుందని వెల్లడించారు. పరశురామ్తో సినిమా ఇంకా ఫైనల్ కాలేదని, ఫైనల్ స్క్రిప్ట్ వినిపించాల్సి ఉందని, మరో పది రోజుల్లో ఆయన వస్తారని పేర్కొన్నారు. మరోవైపు తరుణ్ భాస్కర్తోనూ ఓ సినిమాకి చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. అంతేకాదు `ధూత` వెబ్ సిరీస్ కూడా ఆల్మోస్ట్ షూటింగ్ పూర్తయ్యిందని పేర్కొన్నారు.
అమీర్ ఖాన్తో కలిసి నటిస్తున్న బాలీవుడ్ మూవీ `లాల్ సింగ్ చద్దా`లో తనని ఆదరించే తీరుని బట్టి నెక్ట్స్ పాన్ ఇండియా సినిమాలపై ఫోకస్ పెడతానని వెల్లడించారు నాగచైతన్య. ఇదిలా ఉంటే తన మీడియా మీట్లో వ్యక్తిగత విషయాలను చర్చకు రానివ్వలేదు. ఇటీవల నాగచైతన్య.. శోభితా దూలిపాళ్లతో డేటింగ్ చేస్తున్న వార్తలొచ్చిన విషయం తెలిసిందే. దీంతో దానిపై స్పందిస్తే వివాదం అవుతుందనే ఉద్దేశ్యంతో ముందే జాగ్రత్త పడటం విశేషం.