పవన్ ఆ పని చేస్తా అంటే అన్నయ్య వద్దు అన్నారు.. నా బ్రదర్స్ జోలికొస్తే తాట తీస్తా: నాగబాబు
మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా జరుగుతున్నాయి. చిరు బర్త్ డే సందర్భంగా గ్రాండ్ మెగా కార్నివాల్ పేరుతో ఈవెంట్ కూడా నిర్వహించారు.
మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా జరుగుతున్నాయి. చిరు బర్త్ డే సందర్భంగా గ్రాండ్ మెగా కార్నివాల్ పేరుతో ఈవెంట్ కూడా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి నాగబాబు, హీరో శ్రీకాంత్, సాయిధరమ్ తేజ్, దిల్ రాజు లాంటి ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. నాగబాబు ఈ ఈవెంట్ లో సుదీర్ఘంగా ప్రసంగించి చిరంజీవిపై తన ప్రేమ చాటుకున్నారు.
chiranjeevi
నాగబాబు మాట్లాడుతూ 21 ఏళ్ల వయసులో కుర్రవాడిగా చిరంజీవి గారు ఇండస్ట్రీలో నటుడిగా ఎదగాలని కలగన్నారు. ఇప్పుడు మహా సామ్రాజ్యాన్ని స్థాపించారు. అన్నయ్య గురించి నాకంటే బాగా చెప్పేవారు ఎవరూ ఉండరు. అన్నయ్య గురించి ఎవరికీ తెలియని విషయాలు కూడా నాకు తెలుసు అని నాగబాబు అన్నారు.
ఆయన స్థాపించిన సామ్రాజ్యం వల్ల ఒక తమ్ముడిని నిర్మాత చేశారు. అంటే నేను. మరో తమ్ముడు పవన్ కళ్యాణ్.. పవన్ పేరు చెప్పగానే ఆడిటోరియం హోరెత్తింది. పవన్ ముందుకుగా దర్శకుడు కావాలని కోరిక. తన ఆలోచనలని సినిమా ద్వారా చూపించాలి అని అనుకున్నాడు. కానీ అన్నయ్య మాత్రం.. నువ్వు డైరెక్టర్ కావాలంటే కాస్త ఆలస్యంగా అయినా కావచ్చు. కానీ నీలో ఒక స్పార్క్ ఉంది. ఇప్పుడు హీరోగా నటించు అని చెప్పారు.
అన్నయ్య మాట కాదనకుండా పవన్ పవర్ స్టార్ గా మీ ముందుకు వచ్చారు. అలాగే జనసేనానిగా మరి రాజకీయ చైతన్యం తీసుకువస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని నాగబాబు అన్నారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం మార్చబోతున్నాడు అని నాగబాబు అన్నారు. అలాంటి నాయకుడిని తెలుగు ప్రజలకు అందించిన ఘనత చిరంజీవి గారిది అని నాగబాబు అన్నారు.
అన్నయ్య ఎంతో సాధించారు. ఆయన వ్యక్తిత్వం నాకు తెలుసు. కానీ అలాంటి వ్యక్తినే విమర్శించడమే కొందరు వ్యక్తులు, మీడియా పనిగా పెట్టుకున్నాయి. అన్నయ్యని, తమ్ముడిని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకోలేను. స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తా. నన్ను కాంట్రవర్షియల్ పర్సన్ అనుకున్నా పర్వాలేదు అని నాగబాబు అన్నారు. ఎవరేమనుకున్నా పర్వాలేదు.. నా అన్నని, తమ్ముడిని ఎవరైనా ఏమైనా అంటే తాట తీస్తా అని నాగబాబు వార్నింగ్ ఇచ్చారు.
చిరంజీవి గారి జీవితం ఇప్పటి యువతకి ఆదర్శం అని నాగబాబు అన్నారు. మా నాన్నగారు సాధారణ కానిస్టేబుల్. నెలకి రూ. 200 చెన్నైకి పంపిస్తుంటే హరిప్రసాద్, సుధాకర్ లతో కలసి రూమ్ లో ఉంటూ అవకాశాలు వెతుకున్నారు అని నాగబాబు గుర్తు చేసుకున్నారు.