అప్పుడే జాన్వీకి పట్టిన పెళ్లి గోల... అదే సమయంలో అమ్మ శ్రీదేవి పై అభిమానం
అతిలోక సుందరి శ్రీదేవి తన జాన్వీ కపూర్ తన పెళ్లి గురించి ఆసక్తిగా వ్యాఖ్యలు చేశారు. తన పెళ్లి ఎక్కడ, ఎలా, ఎలాంటి వరుడితో జరగాలో పూస గుచ్చినట్లు చెప్పారు.
శ్రీదేవి వారసురాలిగా వెండితెరకు పరిచయమైన జాన్వీ కపూర్, అందంలో తల్లికి ఏమాత్రం తీసిపోదు. ఇప్పుడిప్పుడే ఆమె అడుగులు బాలీవుడ్ లో పడుతుండగా నాలుగు చిత్రాల వరకు నటించారు.
ఇక జాన్వీ కపూర్ సౌత్ మూవీలో నటిస్తే చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. జాన్వీ మాత్రం ఆ దిశగా అడుగులు వేయడం లేదు. ఆమెకు సౌత్ చిత్రాల పట్ల అంత ఆసక్తి లేదని ఒక వాదన ఉంది.
తల్లి శ్రీదేవి పుట్టిన పెరిగిన ప్రదేశాలపై తనకు ఎంత అభిమానం ఉందో తెలియజేసింది జాన్వీ కపూర్. తన పెళ్లి తంతును అమ్మ జ్ఞాపకాలతో ముడి పెట్టి తల్లిపై ప్రేమను చాటుకుంది.
ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి మనసులో మాట బయటపెట్టింది. తన డ్రీమ్ వెడ్డింగ్ గురించి చెప్పుకొచ్చింది. పెళ్లి తంతు రెండు మూడు రోజుల్లో ముగిసిపోవాలి. కాప్రి ఐల్యాండ్లో ఓ ప్రైవేట్ బోట్లో నా గ్యాంగ్తో కలిసి బ్యాచిలర్ పార్టీ చేసుకున్నాక, తిరుపతిలో నా పెళ్లి చేసుకుంటాను.
మెహందీ, సంగీత్ కార్యక్రమాలు చెన్నైలోని మైలాపూర్లో ఉన్న అమ్మ నివసించిన ఇంటిలో జరగాలి. పెళ్లికి దక్షిణాది సంప్రదాయ చీర ధరించాలనేది నా కోరిక అని చెప్పింది.
ఇక తనకు కాబోయేవాడు తెలివితేటలు ఉన్న వాడైతే చాలని చెప్పింది జాన్వీ. ఆమె ప్రస్తుతం ‘గుడ్ లక్ జెర్రీ’తో పాటు ఓ దక్షిణాది చిత్రం హిందీ రీమేక్లో నటిస్తోంది.