వణికే చలి, మంచులో మెగా హీరోలను చిరు ఎంత కష్ట పెట్టాడో.. సంక్రాంతి పండగ ఫోటోలు వైరల్.. అందరి చూపు అతనిపైనే
ఓ వైపు వణికే చలి, మరోవైపు ఎర్లీ మార్నింగ్ మంచు పొగ గార్డెన్లో మెగా హీరోలకు చుక్కలు చూపించాడు చిరంజీవి. అయితే ఇందులో అందరికి చూపు మాత్రం అతనిపైనే ఉండటం విశేషం.
మెగా ఫ్యామిలీ సంక్రాంతి పండని బెంగుళూరులో సెలబ్రేట్ చేసుకున్నారు. చిరంజీవి ఫ్యామిలీతోపాటు, అల్లు అరవింద్ ఫ్యామిలీ కూడా అందులో పాల్గొని పండగని మరింత ప్రత్యేకంగా మార్చుకున్నారు. గత మూడు రోజులుగా వీళ్లు అక్కడే పండగ చేసుకుని నిన్న రిటర్న్ అయ్యారు. అయితే ఈ సందర్భంగా మెగా బ్రదర్ కొన్ని ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు.
![article_image2](https://static-ai.asianetnews.com/images/01hmam3vqxxat5r6qhp74n6szx/gd9-49wauaai9to-jpg_300x225xt.jpg)
ఇందులో ఉదయాన్నే పండగ పూట చిరంజీవి వారిని ఎంతగా కష్టపెట్టాడో ఇందులో చూపించారు. నాగబాబు, చిరంజీవి సెల్ఫీలతో ఎంజాయ్ చేస్తున్నారు. పొద్దు పొద్దున్నే వాళ్లు పండగ చేసుకున్నారు. కానీ తమ పిల్లలను మాత్రం గట్టిగానే ఇబ్బంది పెట్టారు.
ఇందులో పెద్దవాళ్లు చిరంజీవి, నాగబాబు, వారి చెల్లెళ్లు, బావలు ఎంజాయ్ చేస్తుంటే, వెనకాల మాత్రం రామ్చరణ్, సాయిధరమ్ తేజ్, శిరీష్, ఉపసాన చలికి వణుకుతూ కనిపించారు. వీరంతా బెంగుళూరు గెస్ట్ హౌజ్లోని గార్డెన్ ఏరియాలో ఇలా పొద్దుపొద్దున్నే కనిపించడం విశేషం.
ఈ ఫోటోలను నాగబాబు ఫోటోల్లో బంధించి సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. మెగా ఫ్యామిలీని ఇలా చూసి ఫ్యాన్స్ అంతా ఖుషి అవుతున్నారు.
అయితే ఇందులో అందరికి చూపు మాత్రం ఒక్కరిపై పడింది. అది పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్. ఆయనే ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే ఇందులో అకీరా తన మ్యూజిక్ పర్ఫెర్మ్ కూడా చేశారు. అది మరింత ఎట్రాక్ట్ చేసింది.
ఎప్పుడు చిరంజీవి ఇంట్లో సంక్రాంతి సెలబ్రేషన్ జరుగుతుంది. కానీ ఈ సారి మాత్రం బెంగుళూరులో పండగ చేసుకున్నారు. అందులో చిరంజీవి దంపతులు, నాగబాబు, రామ్చరణ్, అల్లు అరవింద్, బన్నీ, ఉపాసన, అల్లు స్నేహారెడ్డి, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్, శిరీష్, అకీరా, ఆద్య, నిహారిక, లావణ్య త్రిపాఠి, శ్రీజ, సుస్మిత వంటి వారు పాల్గొని సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకున్నారు.