- Home
- Entertainment
- Upasana: ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్, పిల్లల విషయంలో సస్పెన్స్ లో పెట్టిన ఉపాసన.. వైరల్ అవుతున్న పోస్ట్
Upasana: ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్, పిల్లల విషయంలో సస్పెన్స్ లో పెట్టిన ఉపాసన.. వైరల్ అవుతున్న పోస్ట్
పిల్లల్ని కనకూడదు అని నిర్ణయించుకున్న వారికి నేను అవార్డు ఇస్తాను అని సద్గురు అన్నారు. అయితే దీనిపై ఉపాసన తాజాగా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది.

టాలీవుడ్ క్రేజీ కపుల్ రాంచరణ్, ఉపాసన అన్యోన్యంగా జీవిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ కపుల్ కి వివాహమై పదేళ్లు గడుస్తోంది. రాంచరణ్, ఉపాసన వివాహం 2012లో వైభవంగా జరిగింది. రాంచరణ్ సినిమాలతో బిజీగా ఉంటే.. ఉపాసన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తోంది.
వివాహమై ఇన్నిరోజులు గడుస్తున్నా ఈ జంట సంతానం విషయంలో తీపికబురు ఇంకా చెప్పలేదు. సోషల్ మీడియాలో దీని గురించి చర్చ జరుగుతూనే ఉంది. మీడియా ముందు ఈ ప్రశ్న ఎదురైనా ఉపాసన దాటవేస్తూ వచ్చింది. ఇటీవల ఆధ్యాత్మిక గురువు సద్గురుతో జరిగిన కార్యక్రమంలో ఉపాసన కొణిదెల పాల్గొంది.
తాను పిల్లల్ని కనడం, కనకపోవడం గురించి బయట చర్చ జరుగుతోంది అంటూ ఉపాసన సద్గురు వద్ద ప్రస్తావించింది. దీనికి సద్గురు ఇచ్చిన సమాధానం షాకింగ్ గా మారింది. ఆరోగ్యంగా ఉండి కూడా పిల్లలు కనకూడదు అని నిర్ణయించుకున్న వారిని నేను అభినందిస్తాను. ఎందుకంటే ఇప్పటికే ప్రపంచ జనాభా 10 కోట్లు సమీపిస్తోంది. సమానం అంతరించిపోతున్న జీవులం కాదు. ఇంకా ఎక్కువవుతున్నాం.
పిల్లల్ని కనకూడదు అని నిర్ణయించుకున్న వారికి నేను అవార్డు ఇస్తాను అని సద్గురు అన్నారు. అయితే దీనిపై ఉపాసన తాజాగా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. ఒక రకంగా పోస్ట్ మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. అలాగే సుస్పెస్ కూడా.
పిల్లల్ని కనకూడదు అని నిర్ణయించుకున్న వారికి నేను అవార్డ్ ఇస్తానని సద్గురు అన్నారు. దీనిపై ఉపాసన కామెంట్ పెట్టింది. 'సద్గురు.. మీ అవార్డు తీసుకునేందుకు మా తాత అంగీకరించడం లేదు' అంటూ ఉపాసన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
అంటే ఉపాసన పిల్లలని కనేందుకు సిద్ధంగా ఉందని అర్థం. అయితే అది ఎప్పుడు అనేది మాత్రం సస్పెన్స్ గానే ఉండిపోయింది. ఉపాసన అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాప్ చంద్రారెడ్డి మనవరాలు అనే సంగతి తెలిసిందే.