మెగా హీరోలంతా ఒకే స్క్రీన్ పై, భారీ మల్టీ స్టారర్ కు డైరెక్టర్ ఎవరంటే?
టాలీవుడ్లో ఓ భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్కు రంగం సిద్ధమవుతున్నట్లు సినీ వర్గాల్లో ఊహాగానాలు ఊపందుకున్నాయి. మెగా ఫ్యామిలీకి చెందిన చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, నాగబాబు, నిహారిక లాంటి స్టార్స్ తో ఇండియన్ సినిమా హిస్టరీలోనే అరుదైన మల్టీ హీరో సినిమా తెరకెక్కించబోతున్నారట. ఇంతకీ ఈ సినిమాకు దర్శకుడు ఎవరై ఉంటారో తెలుసా?
- FB
- TW
- Linkdin
Follow Us
)
mega heroes
మెగా ఫ్యాన్స్ కు పండగలాంటివార్త. చిరంజీవి కాని, రామ్ చరణ్ కాని,..మెగా హీరోల సినిమాలు సింగిల్ గా వస్తేనే పండగ చేసుకుంటారు అభిమానులు. అటువంటిది మెగా ఫ్యామిలీ హీరోలంతా కలిసి ఓ భారీ మల్టీ స్టారర్ సినిమా చేస్తే ఎలా ఉంటుంది. ఊహించుకోడానికే క్రేజీగా, థ్రిల్లింగ్ గా ఉంది కదా? ప్రస్తుతం ఇండస్ట్రీలో అదే ప్రయత్నం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఈ ప్రాజెకట్ ఐడియా ఎవరిది? ఈ సినిమాను డైరెక్ట్ చేయబోయేది ఎవరో తెలుసా?
Mega Family
ఈ మెగా మల్టీస్టారర్ ప్రాజెక్ట్కు దర్శకత్వం వహించబోయే వ్యక్తి ఎవరో కాదు తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. ఈయన పేరు పరిశ్రమలో వినిపిస్తోంది. 'విక్రమ్', 'లియో' వంటి సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్స్ తర్వాత, లోకేష్ ఇప్పుడు మెగా ఫ్యామిలీతో కలిసి ఓ పవర్ఫుల్ యాక్షన్ యూనివర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రాజెక్ట్ స్కేల్ను దృష్టిలో పెట్టుకొని మైత్రీ మూవీ మేకర్స్ లాంటి ప్రముఖ నిర్మాణ సంస్థ ఇప్పటికే బడ్జెట్ పరంగా అడ్వాన్స్ చెల్లించినట్లు సమాచారం.
ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, స్క్రిప్ట్, మ్యూజిక్ డైరెక్టర్ వివరాలు ఇంకా అధికారికంగా బయటకు రాలేదు. కానీ ఈ ఏడాది చివర్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. చిత్ర షూటింగ్ 2025 ప్రారంభంలో ప్రారంభమయ్యే అవకాశముంది.
మెగా ఫ్యామిలీ మొత్తం ఒకే ఫ్రేమ్లో కనిపించబోతున్న వార్తకు ఫ్యాన్స్ నుండి భారీ స్పందన వస్తోంది. సోషల్ మీడియాలో మెగా అభిమానులు ఈ వార్తను పండుగలా సెలబ్రేట్ చేస్తుండటంతో, ఈ ప్రాజెక్ట్ మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి.ఈ ప్రాజెక్ట్ పై ఉన్న హైప్ చూస్తే, ఇది భారతీయ సినిమా చరిత్రలో ఒక మైలురాయి కావొచ్చని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.