ఏపీలో పొలిటికల్ హీట్.. మజా వస్తోంది అంటూ మంచు లక్ష్మి ఆసక్తికర వ్యాఖ్యలు
ఇటీవల నటి మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఎక్కువగా సందడి చేస్తోంది. మంచు లక్ష్మి ఎలాంటి డ్రెస్ ధరించినా గ్లామర్ గా కనిపించేందుకు ప్రాధాన్యత ఇస్తుంది.
ఇటీవల నటి మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఎక్కువగా సందడి చేస్తోంది. మంచు లక్ష్మి ఎలాంటి డ్రెస్ ధరించినా గ్లామర్ గా కనిపించేందుకు ప్రాధాన్యత ఇస్తుంది. ఇంస్టాగ్రామ్ లో మంచు లక్ష్మి తరచుగా తన పిక్స్ షేర్ చేయడం చూస్తూనే ఉన్నాం.
మంచు లక్ష్మి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. పరిమిత సంఖ్యలో సినిమాలు చేసినప్పటికీ వైవిధ్యమైన పాత్రల్లో మెరిసింది. గుండెల్లో గోదారి, వైఫ్ ఆఫ్ రామ్ లాంటి చిత్రాల్లో నటించింది.
మంచు లక్ష్మి టాలీవుడ్ లో మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్. యాంకర్ గా కూడా మంచు లక్ష్మి రాణించింది. టాలీవుడ్ కి సంబందించిన ఈవెంట్స్ లో చురుగ్గా పాల్గొనడం, అందరితో సన్నిహితంగా ఉండడం మంచి లక్ష్మిలోని బెస్ట్ క్వాలిటీస్. ఇటీవల మంచు లక్ష్మి యూట్యూబ్ లోకి కూడా ఎంటర్ అయింది. మై హోమ్ టూర్, మై మేకప్ అంటూ మంచు లక్ష్మి యూట్యూబ్ లో పలు వీడియోలు చేస్తోంది.
అయితే అప్పుడప్పుడూ మంచు లక్ష్మి తాను చేసే కామెంట్స్ వల్ల ట్రోలింగ్ ఎదుర్కొంటూ ఉంటుంది. తాను టాలీవుడ్ కి వచ్చి పొరపాటు చేశానని .. హాలీవుడ్ లో ఉండి ఉంటే ఇంకా ఎక్కువ ఆఫర్స్ తో మంచి గుర్తింపు పొందేదాన్ని అంటూ ఆ మధ్యన మంచు లక్ష్మి చేసిన వ్యాఖ్యలపై ట్రోలింగ్ జరిగింది.
అయితే తాజాగా మరోసారి మంచు లక్ష్మి వార్తల్లో నిలిచింది. తాజా ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలపై మంచు లక్ష్మి ఆసక్తిర వ్యాఖ్యలు చేసింది. చంద్రబాబుని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పవన్ కళ్యాణ్ గురువారం రోజు పరామర్శించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్.. నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ సమక్షంలో టిడిపి, జనసేన పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలసి వెళతాయని అధికారికంగా అనౌన్స్ చేసారు.
దీనితో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. తెలుగు దేశం, జనసేన క్యాడర్ జోష్ లో ఉండగా.. వైసిపి నేతలు పవన్ పై విమర్శలు సంధిస్తున్నారు. ఈ కీలక పరిణామంపై మంచు లక్ష్మి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేసింది. 'వావ్ ఇప్పుడు ఏపీ రాజకీయాలు మరింత మజా ఇచ్చేలా మారాయి, ఆసక్తికరంగా మారాయి అంటూ పేర్కొంది. దీనితో నెటిజన్లు మంచు లక్ష్మిని.. అసలు మీ ఫ్యామిలీ మద్దతు ఏ పార్టీకి అంటూ ప్రశ్నిస్తున్నారు. మంచు ఫ్యామిలీ విష్ణు, మనోజ్ వర్గంగా విడిపోయింది అంటూ ప్రచారం జరుగుతోంది.