- Home
- Entertainment
- MSG 41 Days Collections: `మన శంకర వర ప్రసాద్ గారు` రేర్ మైల్ స్టోన్.. ఓటీటీలోకి వచ్చాక కూడా చిరు మూవీ జోరు
MSG 41 Days Collections: `మన శంకర వర ప్రసాద్ గారు` రేర్ మైల్ స్టోన్.. ఓటీటీలోకి వచ్చాక కూడా చిరు మూవీ జోరు
చిరంజీవి, నయనతార జంటగా అనిల్ రావిపూడి రూపొందించిన `మన శంకర వర ప్రసాద్ గారు` మూవీ ఓటీటీలోకి వచ్చాక కూడా థియేటర్లలో సత్తా చాటుతోంది. ఈ మూవీకి డీసెంట్ నెంబర్స్ వస్తున్నాయి.

మన శంకర వర ప్రసాద్ గారు మూవీ లేటెస్ట్ కలెక్షన్లు
మెగాస్టార్ చిరంజీవికి చాలా రోజుల తర్వాత తన రేంజ్కి తగ్గ హిట్ పడింది. ఈ సంక్రాంతికి ఆయన `మన శంకర వర ప్రసాద్ గారు` మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ ఏకంగా తెలుగులో రీజనల్ ఫిల్మ్స్ లో ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ మూవీ ఇప్పటి వరకు 41రోజులు పూర్తి చేసుకుంది. ఓ వైపు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నా, థియేటర్లలో రన్ అవుతుంది. డీసెంట్ కలెక్షన్లని వసూలు చేస్తోంది.
మన శంకర వర ప్రసాద్ గారు మూవీ రేర్ మైల్ స్టోన్
విడుదలై 41 రోజులు పూర్తి చేసుకున్న ఈ మూవీని అరుదైన మైల్ స్టోన్ కి చేరింది. ప్రముఖ కలెక్షన్ల సైట్ `సాక్నిల్క్` లెక్కల ప్రకారం ఇప్పటి వరకు ఇది రూ.300కోట్ల వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా మూడు వందల క్లబ్లో చేరడం విశేషం. పాన్ ఇండియా మూవీస్ కాకుండా ఈ స్థాయి వసూళ్లని రాబట్టిన తొలి సినిమాగా `మన శంకర వర ప్రసాద్ గారు` రికార్డు సృష్టించింది. అరుదైన మైల్ స్టోన్ని టచ్ చేసిందని చెప్పొచ్చు.
300కోట్ల క్లబ్లో `మన శంకర వర ప్రసాద్ గారు` మూవీ
వరల్డ్ వైడ్గా ఇది రూ.300.3కోట్లు వసూలు చేయగా, ఇండియా నెట్ 217.2కోట్లుగా ఉంది. ఇండియా గ్రాస్ రూ.257కోట్లు, ఓవర్సీస్లో రూ.43కోట్లు రాబట్టింది (చిత్రం బృందం మాత్రం ఇది రూ.380కోట్లు వసూలు చేసినట్టు వెల్లడించింది). ఈ మూవీకి రూ.120కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయ్యింది. దాదాపు రూ.60-70 కోట్లకు మధ్య లాభాలు సాధించింది. బయ్యర్లకి, ఎగ్జిబిటర్లకి లాభాల పంట పండించిందని చెప్పొచ్చు. అయితే ఓటీటీలోకి వచ్చిన సినిమా థియేటర్లో ఆడటం చాలా అరుదు. కానీ చిరంజీవి `మన శంకర వర ప్రసాద్ గారు` మాత్రం థియేటర్లలో ఇంకా డీసెంట్ నెంబర్స్ ని రాబట్టడం విశేషంగా చెప్పొచ్చు.
ఈ శనివారం టీవీలోకి `మన శంకర వర ప్రసాద్ గారు` టెలికాస్ట్
`మన శంకర వర ప్రసాద్ గారు` మూవీ గత వారం జీ 5 ఓటీటీలోకి వచ్చింది. వచ్చిన 24 గంటల్లోనే రికార్డ్ వ్యూస్ని సాధించింది. 200 మిలియన్లకుపైగా వ్యూస్ మినిట్స్ ని సాధించింది. ఇప్పుడు వారం గడుస్తున్న టాప్లో నడుస్తోంది. ఇప్పుడు టాప్ 3లో ఉండటం విశేషం. ఇక వచ్చే వారం ఇది టీవీలోకి రాబోతుంది. ఈ నెల 28న(శనివారం) జీ తెలుగులో సాయంత్రం 5.30లకు టెలికాస్ట్ కానుంది. ఈ విషయాన్ని జీ వాళ్లు ప్రకటించారు. మరి అటు థియేటర్లలో, ఇటు ఓటీటీలో దుమ్మురేపిన ఈ చిత్రం టీవీలో ఎలాంటి ఆదరణ పొందుతుందో చూడాలి.
`మన శంకర వర ప్రసాద్ గారు` ఎలా ఉందంటే?
చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన `మన శంకర వర ప్రసాద్ గారు` మూవీలో నయనతార హీరోయిన్గా నటించింది. వెంకటేష్ స్పెషల్ రోల్ చేశారు. చిరు కూతురు సుస్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మించారు. సంక్రాంతి పండక్కి మంచి ఫ్యామిలీ, ఫన్ కంటెంట్తో ఈ మూవీని రూపొందించారు అనిల్. మహిళా ప్రేక్షకులకు, చిరంజీవి అభిమానులకు, అలాగే చిన్నపిల్లల్ని అలరించేలా ఈ మూవీ ఉండటంతో అన్ని వర్గాల ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు.

