విడాకుల తరువాత ఒంటరిగా మిగిలిపోయిన సౌత్ బ్యూటీస్
ఇద్దరు దంపతులు ఎప్పటికీ కలిసుంటేనే అది సక్సెస్ఫుల్ మ్యారేజ్ అవుతుంది. కానీ సినీ రంగంలో అలాంటి రిలేషన్స్ అరుదే. చాలా మంద తారలు తమ భాగస్వాములతో పొసగక విడాకులు తీసుకున్న వార్తలు మనం తరుచూ వింటుంటాం. అయితే అలా విడాకులు తీసుకున్న వారిలో కొంత మంది మరో పెళ్లి చేసుకుంటే.. మరికొందరు మాత్రం ఒంటరిగానే మిగిలిపోయారు.
1990లో పెళ్లి చేసుకున్న నటి లిజీ, దర్శకుడు ప్రియదర్శన్ లు దాదాపు 24 ఏళ్ల తరువాత 1990లో విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత లిజీ ఒంటరిగానే ఉండిపోయింది.
మలయాళ స్టార్ హీరో దిలీప్, హీరోయిన్ మంజు వారియర్లు 1998 అక్టోబర్ 20న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే 16 ఏళ్లు కలిసున్న తరువాత దిలీప్ మరో హీరోయిన్తో సన్నిహితంగా ఉండటంతో 2015 జనవరిలో వీరు విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత తిరిగి యాక్టింగ్ కెరీర్ ప్రారంభించిన మంజు, ఒంటరిగానే ఉంటుంది.
నటి రచనా నారాయణన్ కుట్టి తాను ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్న సమయంలో సదా శివన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే ఒక్క ఏడాదిలో వీరిద్దరు మనస్పర్థలతో విడిపోయారు. 2012లో విడాకులు తీసుకున్న దగ్గర నుంచి రచనా ఒంటరిగానే ఉంటున్నారు.
మరో చరిత్ర సినిమాతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న నటి సరిత. ఈమె 1987లో ముఖేష్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే 15 ఏళ్ల క్రితం ముఖేష్తో అభిప్రాయ భేదాలతో విడిపోయిన సరిత, అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటుంది.
నటి గాయని మమతా మోహన్ దాస్ తన చిన్ననాటి స్నేహితుడు ప్రగీత్ను పెళ్లి చేసుకుంది 2011లో గ్రాండ్గా వీరి వివాహం జరిగింది. అయితే ఒక్క ఏడాదిలోనే మనస్పర్దలతో ఈ జంట విడిపోయారు. అప్పటి నుంచి ఆమె ఒంటరిగానే ఉంటుంది.