రెక్కలొచ్చి ఎగిరిపోయాడు... గౌతమ్ చేసిన పనికి ఆవేదనలో నమ్రత, ఎప్పుడు తిరిగొస్తాడో అంటూ ఎమోషనల్!
మహేష్ కుమారుడు గౌతమ్ ఘట్టమనేని చేసిన పని తల్లి నమ్రతను షాక్ లోకి నెట్టింది. తనలో సగభాగం దూరమైనట్లుందన్న ఆమె ఒక ఎమోషనల్ నోట్ షేర్ చేశారు.
Mahesh Babu son Gautham
పిల్లల్ని ఎలా ప్రేమించాలో బహుశా నమ్రత-మహేష్ దంపతులను చూసి నేర్చుకోవాలేమో. కెరీర్, సంపాదన అంటూ బిడ్డల్ని నిర్లక్ష్యం చేసే పేరెంట్స్ మహేష్, నమ్రతలను స్ఫూర్తిగా తీసుకోవాలి. బిజీ లైఫ్ విషయానికి వస్తే... మహేష్ కంటే బిజీగా ఉండేది ఎవరో చెప్పండి. మనసుంటే మార్గం ఉంటుందన్నట్లు పిల్లల పట్ల బాధ్యత, ప్రేమ ఉన్నప్పుడు సమయం అదే దొరుకుతుంది. కేవలం ఆస్తులు సంపాదించి ఇవ్వడమే వారసులకు చేసే మేలని చాలా మంది భ్రమపడుతూ ఉంటారు.
Mahesh Babu son Gautham
మంచి కుటుంబం నిర్మిస్తే మంచి సమాజం ఆటోమేటిక్ గా ఏర్పడుతుంది. అది మహేష్(Mahesh Babu) కి బాగా తెలుసు. సితార, గౌతమ్ లకు అన్నీ తామై వ్యవహరిస్తారు. విద్యాబుద్దులు నేర్పుతారు. వారికి ప్రపంచాన్ని పరిచయం చేస్తారు. పదేళ్ల సితార చాలా మెచ్యూర్డ్ గా ఉంటుంది. దానికి కారణం మహేష్, నమ్రతల పెంపకం.
Mahesh Babu son Gautham
ప్రతి ఏడాది నాలుగైదు వరల్డ్ టూర్స్ కి వెళతారు. సరదాగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు. ఈ స్టార్ కపుల్ ఎక్కడికెళ్లినా పిల్లలు వెంట ఉండాల్సిందే. అంతగా సితార, గౌతమ్ లను తమ జీవితంలో భాగం చేసుకున్నారు.
Mahesh Babu son Gautham
అయితే ఫస్ట్ టైం గౌతమ్(Gautham Ghattamaneni) పేరెంట్స్ లేకుండా ఓ ట్రిప్ కి వెళుతున్నాడు. దీంతో నమ్రత చాలా ఎమోషనల్ అయ్యారు. ఆమె సుదీర్ఘ సందేశం పోస్ట్ చేశారు. గౌతమ్ మొదటిసారి ఒంటరిగా విదేశాలకు కల్చరల్ ట్రిప్ కి వెళుతున్నాడు. నాలో సగభాగం దూరం అవుతున్న భావన కలుగుతుంది. దీన్ని జీర్ణించుకోవడానికి చాలా సమయం పట్టింది.
Mahesh Babu son Gautham
ఈ బాధ గౌతమ్ తిరిగి కళ్ల ముందుకు వచ్చే వరకు తీరదు. మా బుజ్జికన్నకు రెక్కలొచ్చి ఎగిరిపోయాడు. ఈ ట్రిప్ నీకు ఎన్నో అనుభవాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. నీ కోసం ఎదురుచూస్తూ ఉంటా... అని నమ్రత చాలా ఎమోషనల్ అయ్యారు. నమ్రత ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతుంది.
Mahesh Babu son Gautham
గౌతమ్ తన ఫ్రెండ్స్ తో వరల్డ్ కల్చరల్ టూర్ కి వెళుతున్నాడు. తన క్లాస్ మేట్స్ తో ఈ టూర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం గౌతమ్ వయసు 16 ఏళ్ళు. మహేష్ వారసుడిగా రెండు మూడేళ్ళలో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. మహేష్ చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరను దున్నేశాడు. గౌతమ్ వన్ నేనొక్కడినే మూవీలో మహేష్ చిన్నప్పటి పాత్ర చేశాడు. సితార సర్కారు వారి పాట మూవీ ప్రమోషనల్ సాంగ్ లో నటించింది.
ప్రస్తుతం మహేష్ ఎస్ఎస్ఎంబీ 28(SSMB 28) షూట్ లో పాల్గొంటున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. వచ్చే ఏడాది విడుదల కానుంది.