AMB Cinemas: ఐదేళ్లు పూర్తి చేసుకున్న మహేష్ బాబు 'ఏఎంబీ సినిమాస్'.. పార్టీలో నమ్రత, గౌతమ్ హంగామా
సెలెబ్రేషన్స్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత, తనయుడు గౌతమ్, సునీల్ నారంగ్, భరత్ నారంగ్, జాన్వీ నారంగ్ హాజరయ్యారు. కేక్ కట్ చేసి చిన్న పార్టీ చేసుకున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు రియల్ లైఫ్ లో కూడా బిజినెస్ మాన్ గా రాణిస్తున్నారు. మహేష్ బాబు ఏషియన్ సునీల్ నారంగ్ భాగస్వామ్యంతో గచ్చిబౌలిలో ఏఎంబీ సినిమాస్ నిర్మించిన సంగతి తెలిసిందే.
![article_image2](https://static-ai.asianetnews.com/images/01hgr4gj8gshvhjhwmaa6jskkq/3-jpg_300x199xt.jpg)
అత్యాధునిక హంగులతో ఈ మల్టీ ఫ్లెక్స్ థియేటర్ ని నిర్మించారు. సినిమాని బెస్ట్ ఎక్స్పీరియన్స్ తో వీక్షించేందుకు ఏఎంబీ సినిమాస్ మంచి వేదికగా సినీ ప్రియులు అక్కడికి పోటెత్తుతుంటారు.
తాజాగా ఎంఏబీ సినిమా ఐదేళ్లు పూర్తి చేసుకుంది. ఐదేళ్ల క్రితం ఈ మల్టీ ఫ్లెక్స్ ని ప్రారంభించారు. ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏఎంబీలో సెలెబ్రేషన్స్ నిర్వహించారు.
ఈ సెలెబ్రేషన్స్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత, తనయుడు గౌతమ్, సునీల్ నారంగ్, భరత్ నారంగ్, జాన్వీ నారంగ్ హాజరయ్యారు. కేక్ కట్ చేసి చిన్న పార్టీ చేసుకున్నారు.
ఇదిలా ఉండగా సూపర్ స్టార్ మహెష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం చిత్రంతో బిజీగా ఉన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.