'మహా సముద్రం' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అను ఇమ్మాన్యుయేల్, అదితి గ్లామర్ మెరుపులు
ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'మహా సముద్రం'(Maha Samudram). అజయ్ భూపతి ఈసారి బలమైన పాత్రలతో ఎమోషనల్ కథని చూపించబోతున్నాడు ఈ దర్శకుడు.
ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'మహా సముద్రం'(Maha Samudram). అజయ్ భూపతి ఈసారి బలమైన పాత్రలతో ఎమోషనల్ కథని చూపించబోతున్నాడు ఈ దర్శకుడు. శర్వానంద్, సిద్ధార్థ్, అదితి రావు, అను ఇమ్మానుయేల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
రావు రమేష్ , జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 తరహాలో బోల్డ్ రొమాన్స్ ఉన్నప్పటికీ బలమైన కథ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలు పెంచేసింది.
అక్టోబర్ 14న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. రిలీజ్ టైం దగ్గర పడడంతో చిత్ర యూనిట్ నేడు ప్రీ రిలీజ్ వేడుక నిర్వహిస్తోంది. శర్వానంద్, సిద్ధార్థ్, అను ఇమ్మాన్యుయేల్, అదితి రావు లతోపాటు ఇతర చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ వేడుకకు హాజరయ్యారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్లు అను ఇమ్మాన్యుయేల్, అదితి రావు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఇద్దరూ కళ్ళు జిగేల్ మనే కాస్ట్యూమ్స్ లో మెరిశారు. అను ఇమ్మాన్యుయేల్ పింక్ శారీలో ఆకట్టుకుంటుంటే.. అదితి రెడ్ డ్రెస్ లో మెరిసింది.
ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ కూడా అతిథిగా హాజరయ్యాడు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్స్ లో విడుదలవుతున్న చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మహా సముద్రంపై కూడా మంచి అంచనాలు ఉండడంతో.. ఈ చిత్రానికి ఓపెనింగ్స్ భారీ స్థాయిలో ఉంటాయని ట్రేడ్ అంచనా వేస్తోంది.
ఆర్ ఎక్స్ 100 చిత్రంలో ప్రేమని ఎమోషనల్ గా చూపించిన అజయ్ భూపతి.. ఈ మూవీలో లవ్ తో పాటు, క్రైమ్ అంశాలని కూడా టచ్ చేసినట్లు ఉన్నాడు.
హీరో హీరోయిన్లతో పాటు.. జగపతి బాబు, రావు రమేష్, కెజిఎఫ్ గరుడ రామచంద్ర రాజు పాత్రలు ప్రేక్షకులని ఆకర్షించే విధంగా ఉన్నాయి.
సుంకర రామబ్రహ్మం ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబర్ 14న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అవుతోంది. ట్రైలర్ తో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి.