ఎన్నికల హోరాహోరీలో సినీ తారలు!
ఈ ఏడాదిలో దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక ఎన్నికల్లో చాలా రాష్ట్రాలలో సినీ తారలు పోటీ పడుతున్నారు.
ఈ ఏడాదిలో దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక ఎన్నికల్లో చాలా రాష్ట్రాలలో సినీ తారలు పోటీ పడుతున్నారు. కొందరు సొంతంగా పార్టీ పెట్టి బరిలో దిగడానికి సిద్ధమవుతుంటే.. మరికొందరు ఇతర పార్టీలలో చేరి టికెట్ దక్కించుకొని ఎన్నికల బరిలో దిగబోతున్నారు. మరి ఎవరెవరు ఏఏ పార్టీ నుండి పోటీల్లో పాల్గొంటున్నారో చూద్దాం!
పవన్ కళ్యాణ్ వామపక్షాలతో పొత్తు పెట్టుకొని తన 'జనసేన' పార్టీ తరఫున రాబోయే ఎన్నికల్లో ఏపీలో అన్ని ప్రాంతాల్లో తన అభ్యర్ధులను పోటీకి దింపబోతున్నారు.
విజయశాంతి - తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ తరఫున మెదక్ ఎంపీగా పోటీ చేయబోతున్నారు.
బాలకృష్ణ - అనంతపురం జిల్లా హిందూపురం నుండి టీడీపీ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేయనున్నారు.
రోజా - వైఎస్సార్ పార్టీ తరఫున చిత్తూరు జిల్లా నగరి నుండి పోటీకి సిద్ధమవుతున్నారు.
ఉపేంద్ర - కర్ణాటకలో తన ప్రజాకీయ పార్టీ తరఫున 28 స్థానాల్లో అభ్యర్ధులను బరిలోకి దిమ్పనున్నారు.
నిఖిల్ గౌడ - జేడీఎస్ పార్టీ తరఫున మాండ్య నుండి పోటీలో పాల్గొనున్నాడు.
కర్ణాటక రాష్ట్ర మాండ్య నుండి ఇండిపెండెంట్ అభ్యర్ధిగా సుమలత పోటీ చేయనున్నారు.
బెంగుళూరు సెంట్రల్ నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్ధిగా ప్రకాష్ రాజ్ పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.
కేరళ నటుడు సురేష్ గోపికి బీజేపీ టికెట్ ఇవ్వబోతుందని టాక్.
నటుడు కమల్ హాసన్ తమిళనాడు ఎంఎన్ఎం పార్టీ తరఫున అన్ని స్థానాల్లో అభ్యర్ధులను దింపబోతున్నట్లు వెల్లడించారు.