- Home
- Entertainment
- కుర్ర హృదయాల్ని గుచ్చుకునేలా కృతి శెట్టి అల్లరి వేషాలు.. సీనియర్ హీరో కొడుకుతో, రూమర్స్ నిజమా..
కుర్ర హృదయాల్ని గుచ్చుకునేలా కృతి శెట్టి అల్లరి వేషాలు.. సీనియర్ హీరో కొడుకుతో, రూమర్స్ నిజమా..
గత ఏడాది వరుస పరాజయాలు ఎదురుకావడంతో జోరుమీదున్న కృతి శెట్టికి కాస్త బ్రేక్ పడింది. ఉప్పెన చిత్రంతో కుర్రాళ్ళ హృదయాల్లో సునామి సృష్టించిన కృతి శెట్టి ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంది. టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారింది.

గత ఏడాది వరుస పరాజయాలు ఎదురుకావడంతో జోరుమీదున్న కృతి శెట్టికి కాస్త బ్రేక్ పడింది. ఉప్పెన చిత్రంతో కుర్రాళ్ళ హృదయాల్లో సునామి సృష్టించిన కృతి శెట్టి ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంది. టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారింది. గత ఏడాది కృతి శెట్టి నటించిన ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి లాంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.
అయితే ఈ ఏడాది కృతి శెట్టి నాగ చైతన్య కస్టడీ చిత్రంపై ఆశలు పెట్టుకుని ఉంది. ఈ చిత్రం విజయం సాధించడం కృతి శెట్టి కెరీర్ కి చాలా కీలకం. ఉప్పెన చిత్రంలో కృతి శెట్టి తన క్యూట్ లుక్స్ తో మాయ చేసింది. ఆ తర్వాత చిత్రాల్లో హాట్ గా కూడా కనిపించింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కృతి శెట్టి తరచుగా తన గ్లామర్ ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా కృతి శెట్టి అల్లరి పిల్లల తుళ్లిపడుతున్న బ్యూటిఫుల్ లుక్స్ షేర్ చేసింది. కన్ను గీటుతూ మాయ చేస్తోంది.
ఊరించే పెదవులతో కృతి శెట్టి మైండ్ బ్లోయింగ్ అనిపించేలా వయ్యారాలు ఒలకబోస్తోంది. లైట్ పింక్ డ్రెస్ లో కృతి శెట్టి ఇస్తున్న ఫోజులు మెస్మరైజ్ చేస్తున్నాయి. కృతి శెట్టి లేటెస్ట్ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే కృతి శెట్టి గురించి ఓ క్రేజీ రూమర్ వైరల్ గా మారుతోంది. తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ సరసన కృతి శెట్టి నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. జాసన్ సంజయ్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నాడట. డెబ్యూ చిత్రంగా ఉప్పెన చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
తమిళంలో ఓ బడా నిర్మాత చొరవ తీసుకుని విజయ్ తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. సంజయ్ ని ఉప్పెన రీమేక్ తో హీరోగా పరిచయం చేయాలని అడుగుతున్నారట. ఈ చిత్రంలో కృతి శెట్టినే హీరోయిన్ గా తీసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే జాసన్ సంజయ్ కి హీరోగా కావడం కంటే దర్శకత్వంపై మక్కువ ఎక్కువ అట. అయితే కొన్ని చిత్రాల్లో హీరోగా నటించాక.. ఆ తర్వాత దర్శకత్వం నటన రెండు కొనసాగించాలని సన్నిహితులు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ఒకే అయితే కృతి శెట్టి ఖాతాలో క్రేజీ ప్రాజెక్టు పడ్డట్లే.