కృష్ణంరాజు సంస్మరణ సభ.. 30కిపైగా అదిరిపోయే వంటకాలు.!
రెబల్ స్టార్ కృష్ణంరాజు (Krishnam Raju) సంస్మరణ సభ నేడు మొగల్తూరులో భారీ ఏర్పాట్లతో జరుగుతోంది. వేలాదిగా తరలివచ్చిన అభిమానులకు భోజన ఏర్పాట్లు చేశారు. 30కిపైగా అదిరిపోయే వెజ్, నాన్ - వెజ్ వంటకాలను చేయించారు.
పశ్చిమ గోదావరిలోని మొగల్తూరులో 10 ఎకరాల మామిడి తోటలో రెబల్ స్టార్, కేంద్ర మాజీ మంత్రి ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు (Krishnam Raju) సంస్మరణ సభను నేడు నిర్వహిస్తున్నారు. వేలాదిగా రెబల్ స్టార్ క్రిష్ణం రాజు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు మొగల్తూరుకు చేరుకున్నారు.
ఈ సందర్భంగా అభిమానుల కోసం అదిరిపోయే వంటకాలను వండించారు. ఇప్పటికే 70 వేలకు మందికి భోజన ఏర్పాట్లు చేయించారని సమాచారం. ఇందులో 30కిపైగా వంటకాలను చేయించారని తెలుస్తోంది. మెనూ చూస్తే షాకింగ్ గా ఉంది. రాజుల వంశస్తులు కావడంతో అదిరిపోయే వంటలు వండించారు. ప్రతి ఒక్కరూ భోజనాలు చేసే వెళ్లాలని ప్రభాస్ కోరారు.
ఈ సందర్భంగా మెనూను పరిశీలిస్తే.. నాన్ - వెజ్ కు సంబంధించి 25 టన్నుల వంటకాలు సిద్ధం చేశారు. ఇందులో 9 టన్నుల మటన్, 6 టన్నుల చికెన్, 6 టన్నుల ఫ్రాన్స్, 4 టన్నుల ఫిష్ వంటకాలను వండించారని సమాచారం. ఇందులో రాజుల బిర్యానీగా పెరొందిన దూకుడు గొర్రె దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ, మటన్ న్ కర్రీ, చికెన్ కర్రీ, ఫ్రై, మటన్ లివర్, చికెన్ లివర్ వండించారు.
అలాగే సీఫుడ్ లో చేపల పులుసు, చేపల వేపుడు, పీతల ఇగురు, మొత్తళ్లు, రామాలు, రొమ్యల బిర్యానీ, రొయ్యల ఇగురు, గోంగూర రొయ్య, తలకాయ చారుత వంటి డిఫరెంట్ వంటకాలను అభిమానులకు రుచి చూపించారు. మరోవైపు వెజ్ లోనూ 20కిపైగా వంటకాలను ఏర్పాటు చేయించారు.
శాఖాహారుల కోసం కూడా ప్రత్యేకమైన వంటకాలను ఏర్పాటు చేయించారు. వెజ్ వంటకాలతో పాటు స్వీట్లు కూడా చేయించారు. వీటిలో సాంబారు, రసం, పెరుగు చట్నీ, మిఠాయి, పూర్ణం, రోటీ, వెజ్ బిర్యానీ, పన్నీర్ కర్రీ, పప్పు, బెండకాయల వేపుడు వంటి వంటలు తయారు చేయించారు. దీంతో అభిమానులపై ప్రభాస్, క్రిష్ణం రాజు కుటుంబ సభ్యులు చూపిస్తున్న ప్రేమకు ఖుషీ అవుతున్నారు.
కృష్ణంరాజు ఈనెల 11న (సెప్టెంబర్ 11న) తుది శ్వాస విడిచారు. మొయినాబాద్ లోని కనకమామిడి ఫౌం హౌజ్ లో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు ముగిసిన విషయం తెలిసిందే. ఈ రోజు ఆయన సంస్మరణ సభకు లక్షకు పైగా అభిమానులు, రాజకీయ నాయకులు కూడా హాజరైనట్టు అంచనా వేస్తున్నారు.