- Home
- Entertainment
- Heroes Rare Pic: ఒకే స్టేజ్పై కృష్ణ, చిరు, నాగ్, వెంకీ, రాజశేఖర్, రమ్యకృష్ణ.. ఇది కదా కావాల్సింది, ఫోటో వెనుక స్టోరీ
Heroes Rare Pic: ఒకే స్టేజ్పై కృష్ణ, చిరు, నాగ్, వెంకీ, రాజశేఖర్, రమ్యకృష్ణ.. ఇది కదా కావాల్సింది, ఫోటో వెనుక స్టోరీ
ఒకే స్టేజ్పై కృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, రాజశేఖర్, రమ్యకృష్ణ, రాఘవేంద్రరావు వంటి బిగ్ స్టార్స్ కనిపిస్తున్నారు. మరి ఈ అరుదైన ఫోటో వెనుక స్టోరీ ఏంటి?

బిగ్ స్టార్స్ రేర్ ఫోటోలు
హీరోల మధ్య ఇప్పుడు సరైన అనుబంధం కనిపించడం లేదు. పోటీనే ఎక్కువగా ఉంటుంది. ఒకరి విషయంలో మరొకరు అసూయతో ఉన్నట్టుగానే అనిపిస్తుంటారు. ఇప్పుడు హీరోలు కలవడమనేది చాలా అరుదు. కానీ ఒకప్పుడు మాత్రం హీరోల మధ్య మంచి రిలేషన్ ఉండేది. నువ్వు పెద్దా, నేను చిన్నా అనే తేడా లేదు. అందరు సమానంగా భావించేవారు. అప్పుడు కలెక్షన్ల గోల లేదు. హిట్, ఫ్లాప్ అనేదే లెక్క. అందుకే హీరోల మధ్య మంచి అనుబంధం ఉండేది. ఒకరి ఈవెంట్కి మరొకరు వెళ్లేవారు. కొన్ని సార్లు ఎక్కువ మంది ఒకే ఈవెంట్లలో సందడి చేసేవారు.
రేర్ పిక్ తెరవెనుక స్టోరీ
తాజాగా ఒక అరుదైన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అభిమానులను ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అందరి అటెన్షన్ గ్రాస్ప్ చేస్తుంది. ఇంతకి ఈ ఫోటో ఏంటంటే, ఇందులో సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, మన్మథుడు నాగార్జున, అలాగే యాంగ్రీ యంగ్ మేన్ రాజశేఖర్, హీరోయిన్ రమ్యకృష్ణ ఒకే స్టేజ్పై ఉన్నారు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు కూడా ఉన్నారు. ఇందులో చిరంజీవికి నాగార్జున ఏదో ఇస్తున్నారు. చిరులో ఆనందం కనిపించింది. స్టేజ్పై అంతా సరదాగా నవ్వుతూ కనిపించారు. వెనకాల రాఘవేంద్రరావు ఇద్దరికి ఏదో చెబుతున్నారు.
ఘరానా బుల్లోడు మూవీ వంద రోజుల ఈవెంట్
ఈ అరుదైన ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది. అభిమానులను ఆకట్టుకుంటుంది. మరీ ఈ ఫోటో వెనుక స్టోరీ ఏంటనేది చూస్తే ఇది `ఘరానా బుల్లోడు` మూవీ వంద రోజుల ఈవెంట్లో దిగినది. నాగార్జున హీరోగా, రమ్యకృష్ణ, ఆమని హీరోయిన్లుగా దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు ఈ మూవీని రూపొందించారు. కీరవాణి సంగీతం అందించారు. ఈ మూవీ 1995 ఏప్రిల్ 25న విడుదలైంది. బ్లాక్ బస్టర్గా నిలిచింది. నాగార్జునకి కమర్షియల్ గా పెద్ద హిట్ని అందించింది. స్టార్గా మరో మెట్టు ఎక్కించింది. అంతేకాదు ఏకంగా వంద రోజులు ప్రదర్శించబడింది. దీంతో వంద రోజుల వేడుకని నిర్వహించారు.
ఘరానా బుల్లోడు ఈవెంట్లో బిగ్ స్టార్స్ సందడి
`ఘరానా బుల్లోడు` వంద రోజుల ఈవెంట్కి సూపర్ స్టార్కృష్ణ, చిరంజీవి, వెంకటేష్, రాజశేఖర్ లను గెస్ట్ లుగా ఆహ్వానించారు. వారు కూడా తమ మధ్య ఉన్న అనుబంధంతో, సాటి హీరోని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశ్యంతో ఈవెంట్కి వచ్చి సక్సెస్ సెలబ్రేషన్లో భాగమయ్యారు. అందరిని ఆకట్టుకున్నారు. అభిమానులను అలరించారు. అయితే ఇందులో వీరు మాత్రమే కాదు, ఏఎన్నార్, రామానాయుడు, సౌందర్య, శ్రీహరి, రోజా, మురళీ మోహన్ ఇలా చాలా మంది పాల్గొన్నారు. 31ఏళ్ల నాటి ఫోటో ఇప్పుడు వైరల్గా మారడం విశేషం. ఇది చూసి ఒకప్పుడు మన స్టార్స్ ఎంతో సరదాగా ఉండేవారు. చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉండేవి ఆ సన్నివేశాలు అని కామెంట్ చేస్తున్నారు. ఇప్పటి తరం హీరోలు కూడా ఇలాంటి బాండింగ్ని మెయింటేన్ చేస్తే బాగుంటుందంటున్నారు.
ప్రస్తుతం బిజీగా స్టార్స్
ఇక ప్రస్తుతం చిరంజీవి ఇటీవల `మన శంకర వర ప్రసాద్ గారు` మూవీతో హిట్ అందుకున్నారు. ఇప్పుడు బాబీతో మూవీకి రెడీ అవుతున్నారు. వెంకటేష్.. త్రివిక్రమ్ తో `ఆదర్శకుటుంబం` మూవీలో నటిస్తున్నారు. ఇటీవల చిరంజీవి `మన శంకర వరప్రసాద్ గారు`లో మెరిసిన విషయం తెలిసిందే. నాగార్జున తన వందవ మూవీతో బిజీగా ఉన్నారు. సూపర్ స్టార్ కృష్ణ లేరు. రాజశేఖర్ కమ్ బ్యాక్ ప్లాన్లో ఉన్నారు. `బైకర్`లో కీలక పాత్ర పోషిస్తున్నారు. రమ్యకృష్ణ సెలక్టీవ్ గా సినిమాలు చేస్తున్నారు. ఇక రాఘవేంద్రరావు దర్శకుడిగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

