నా పరిస్థితే ఇలా ఉంటే.. సామాన్యుల మాటేంటి.. సీఎంకి ఖుష్బూ ఫిర్యాదు
టెక్నాలజీ అభివృద్ధ చెందుతున్న దగ్గర నుంచి సెలబ్రిటీలకు సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ఇటీవల సెలబ్రిటీలకు రేప్ బెదిరింపు వార్తలు తరుచూ వినిపిస్తున్నాయి. తాజాగా సీనియర్ నటి, కాంగ్రెస్ నేత ఖుష్బూకు కూడా ఇలాంటి బెదిరింపులు రావటం కలకలం సృష్టిస్తోంది.
ఇటీవల సెలబ్రిటీలకు రేప్ చేస్తామంటూ బెరిస్తున్న వార్తలు తరుచూ వినిపిస్తున్నాయి. మీ టూ ఉద్యమాన్ని ముందుడి నడిపిస్తున్న గాయని చిన్మయి శ్రీపాద, బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూతురు, రేడియో జాకీ ర్యాపిడ్ రష్మీ లాంటి వారికి ఇలాంటి బెదిరింపులు రావటం సంచలనంగా మారింది.
తాజాగా సీనియర్ నటి, కాంగ్రెస్ నేత ఖుష్బూకు కూడా ఇలాంటి బెదిరింపులు రావటం కోలీవుడ్ పరిశ్రమలో కలకలం సృష్టిస్తోంది. అయితే గతంలో ఇలాంటి బెదిరింపులు సోషల్ మీడియాలో వచ్చేవి, కానీ ఖుష్బూ విషయంలో డైరెక్ట్గా ఫోన్ చేసి బెదిరించటం మరింత వివాదాస్పదమవుతోంది.
అయితే ఈ విషయం ఫైర్ బ్రాండ్ కుష్బూ కూడా ఘాటుగా స్పందించింది. తనకు కాల్ చేసిన వ్యక్తికి సంబంధించిన వివరాలు తన సోషల్ మీడియా పేజ్లో షేర్ చేసిన ఖుష్బూ, అతడి పేరు సంజయ్ శర్మ అని చూపిస్తుందని ఆ కాల్ కోల్కతా నుంచి వచ్చిందని తెలిపింది. ఆ వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలంటూ కోల్కతా పోలీసులను కోరింది ఖుష్బూ.
అంతటితో ఆగకుండా ఆ వివరాలను బెంగాళ్ సీయం మమతా బెనర్జీకి కూడా ట్యాగ్ చేసింది ఖుష్బూ. దీదీ నాకే ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే సాధారణ మహిళ పరిస్థితి ఏంటీ అంటూ ట్విటర్ ద్వారా ప్రశ్నించింది ఖుష్బూ.
సినిమాలు చేస్తూనే రాజకీయాల్లోనూ బిజీగా ఉంది సీనియర్ నటి ఖుష్బూ. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో యాక్టింవ్గా ఉన్న ఈమె సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థులపై విమర్శలను ఎక్కుపెడుతుంటుంది. ట్విటర్ వేదికగా ఖుష్బూ చేసిన కామెంట్స్ తరుచూ వివాదాస్పదమవుతుంటాయి. ఈ నేపథ్యంలో ఆమె మీద తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వినిపిస్తుంటాయి.