షర్ట్ బటన్ విప్పి క్రిస్మస్ విషెస్ తెలిపిన కీర్తిసురేష్.. వెరైటీ లుక్స్ హల్చల్
`మహానటి` చిత్రంతో నేటితరం హీరోయిన్లలో మహానటిగా పిలుచుకుంటున్న కీర్తిసురేష్ క్రిస్మస్ సెలబ్రేషన్లో ఎంజాయ్ చేసింది. కలర్ఫుల్గా క్రిస్మస్ ట్రీని పెంచుకోవడంతోపాటు, తాను డిఫరెంట్గా రెడీ అయి కనువిందు చేసింది. ఆయా ఫోటోలను పంచుకుంటూ అభిమానులకు విషెస్ తెలిపింది. ఎంతో క్యూట్గా ఉన్న కీర్తిసురేష్ మెస్మరైజ్ చేస్తుంది.
కీర్తిసురేష్ స్వతహాగా క్రిస్మస్ ట్రీని డిజైన్ చేసింది. దాన్ని బాగా అలంకరించింది. ఈ సందర్భంగా ఆ ట్రీ వద్ద ఫోటోలకుపోజులిస్తూ ఆకట్టుకుంది.
పెద్ద కళ్లద్దాలు, వైట్ షర్ట్ విత్ రెడ్ డాట్స్, అలాగే రెడ్ లెహంగా దరించింది. అయితే షర్ట్ బటెన్స్ విప్పి తన ఫోటోలకు పోజులివ్వడం విశేషం.
ఇందులో ఎంతో క్యూట్గా కనిపిస్తుంది కీర్తి. ఆమె క్యూట్నెస్ ముద్దొచ్చేలా ఉందంటే అతిశయోక్తి కాదు.
ఈ ఫోటోలను పంచుకుంటూ మేరీ క్రిస్మస్ అని ఫ్యాన్స్ కి, నెటిజన్లకి విషెస్ తెలిపింది కీర్తి.
ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆమె అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
మరోవైపు తెలుగు ఆడియెన్స్ కోసం తెలుగులో వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపింది. తానుప్రస్తుతం `రంగ్దే` చిత్రంలో నితిన్తో కలిసి నటిస్తుంది. ఈ చిత్రంలోని కొత్త ఫోటోని పంచుకుంటూ విషెస్ తెలియజేసింది.
ప్రస్తుతం కీర్తి వరుసగా తెలుగు, తమిళం, మలయాళ సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో ఈ అమ్మడు `రంగ్దే`తోపాటు మహేష్తో `సర్కారు వారి పాట`లో నటిస్తుంది. అలాగే ఆదిపినిశెట్టితో కలిసి `గుడ్లక్ సఖి` సినిమా చేస్తుంది.
తమిళంలో రజనీకాంత్తో `అన్నాత్తే` చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా ప్రస్తుతం వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ చిత్ర యూనిట్లో కొంత మందికి కారోనా సోకడంతో షూటింగ్ నిలిపివేశారు. మరోవైపు రజనీ కూడా అనారోగ్యానికి గురయ్యారు. కరోనా టెస్ట్ చేయగా, నెగటివ్ అని తేలింది. బీపీ కంట్రోల్ కావడం లేదు.