- Home
- Entertainment
- Keerthi Suresh : కీర్తి సురేష్ లేటెస్ట్ ఫోటో షూట్.. నెటిజన్లను అట్రాక్ట్ చేస్తోందీ ‘సఖి’
Keerthi Suresh : కీర్తి సురేష్ లేటెస్ట్ ఫోటో షూట్.. నెటిజన్లను అట్రాక్ట్ చేస్తోందీ ‘సఖి’
ఫీమేల్ ఓరియెంట్ మూవీలతో దూసుకుపోతున్న కీర్తి సురేష్, తన అభిమానులు, ఫాలోవర్స్ ను సరికొత్త ఫొటోషూట్ తో మరింతగా అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా, సోషల్ మీడియాలో ట్రెడిషనల్ వేర్ లో దర్శనమిచ్చిదీ బ్యూటీ.
- FB
- TW
- Linkdin
Follow Us
)
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో కీర్తి సురేష్ (Keerthi Suresh) ఒకరు. ముఖ్యంగా టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఈ మలయాళ ముద్దుగుమ్మ పేరు పక్కాగా ఫిక్స్అయ్యి ఉంటుంది.
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురరుచూస్తున్న మూవీల్లో కీర్తి సురేష్ నటించిన ‘గుడ్ లక్ సఖి’ఒకటి. అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా విజయవంతం పూర్తయ్యింది. మూవీ కూడా రిలీజైంది.
తండా అమ్మాయి పాత్ర పోషించిన కీర్తి సురేష్ తన అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆదిపినిశెట్టి, జగపతి బాబు, రాహుల్ రామక్రిష్ణ నటించిన ఈ మూవీ పై కీర్తి ఆశలు పెట్టుకుంది. ఈ తరుణంలో మూవీ రిలీజై ప్రేక్షకుల ముందు నిలిచింది.
గ్రామీణ వాతావరణంలో చిత్రీకరించిన ఈ మూవీలో కీర్తి సురేష్ చక్కగా ఒదిగిపోవడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. అటు తన సినిమా రిలీజైన సందర్భంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది కీర్తి సురేష్.
తన గ్లామర్ తో నెటిజన్లను ఆకట్టుకునేందుకు తాజాగా ఇన్ స్టాలో ఫొటోలను షేర్ చేసింది కీర్తి సురేష్. రెడ్ కలర్ ట్రెడిషినల్ వేర్ లో ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫొటోలను చూసిన ఫ్యాన్స్ బ్యూటీఫుల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
అయితే, ‘గుడ్ లక్ సఖి’లో కీర్తి సురేష్ అభినయం చాలా మందిని ఆకట్టుకున్నా.. కొందరు మాత్రం చాలా డల్ గా అనిపిందంటూ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో కిర్తీ అభిమానులు తన నెక్ట్స్ మూవీ మహేశ్ బాబుతో కలిసి నటించిన ‘సర్కారు వారి పాట’పైనా ఆశలు పెట్టుకున్నారు.