కార్తీక దీపం టీంకు బై చెప్పిన వంటలక్క.. కేరళకు తిరుగు ప్రయాణం
తెలుగు వెండితెర మీద బాహుబలి ఎంతటి పెద్ద విజయం సాధించిందో బుల్లితెర మీద కార్తీకదీపం సీరియల్ అంత పెద్ద హిట్. ఒక సందర్భంలో దేశంలోనే హయ్యస్ట్ రేటింగ్ సాధించిన టెలివిజన్ సీరియల్గా రికార్డ్ సృష్టించింది కార్తీకదీపం. అయితే ఈ సీరియల్ ఎంత ఫేమస్ అయ్యింది సీరియల్లో వంటలక్క క్యారెక్టర్ కూడా అంతే ఫేమస్ అయ్యింది. ఆ పాత్రలో నటించిన ప్రేమీ విశ్వనాథ్కు భారీ ఫాలోయింగ్ వచ్చింది.
వంటలక్కగా పాపులర్ అయిన ప్రేమీ విశ్వనాథ్ స్వస్థలం కేరళ, పలు మలయాళ సీరియల్స్లో నటించి ఈమె కార్తీకదీపం సీరియల్తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. దీంతో ఇక్కడ కూడా వంటలక్కకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. దీంతో సీరియల్లోనే కాదు సోషల్ మీడియాలో, యూట్యూబ్లో కూడా వంటలక్కను భారీగా పాలో అవుతున్నారు ఫ్యాన్స్.
ప్రేమీ కూడా తన సీరియల్ అప్డేట్స్తో పాటు పర్సనల్ విషయాలు ట్రిప్స్కు సంబంధించిన డీటెయిల్స్ను ఎప్పటికప్పుడు యూట్యూబ్ ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఆసక్తికర వీడియోను షేర్ చేసింది వంటలక్క. తాను కార్తీకదీపం టీంకు బైబై చెపుతున్నాడు. కేరళకు వెళుతున్నట్టుగా వీడియో పోస్ట్ చేసింది.
అయితే ఇందులో అభిమానులు కంగారు పడాల్సి విషయం ఏం లేదు. లాక్ డౌన్ తరువాత తొలి దశలో వారం రోజు షెడ్యూల్ మాత్రం ఉండటంతో జూలై 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ప్రేమీ విశ్వనాథ్తో షూటింగ్ను ప్లాన్ చేశారు. ఆ షెడ్యూల్ పూర్తి కావటంతో ప్రేమీ తిరిగి వెళ్లిపోతోంది. నెక్ట్స్ షెడ్యూల్ సమయానికి మళ్లీ వస్తుంది.
`ప్రస్తుతానికి నా షూటింగ్ పూర్తయ్యింది.. నా షెడ్యూల్ ప్యాకప్ అయ్యింది. ఇక నేను కేరళ వెళ్లాలి.. ఇంక కేరళ నుంచి మీతో టచ్లో ఉంటాను. అక్కడికి వెళ్లాక కేరళ విషయాలు చెబుతాను` అంటూ వీడియోలో వెల్లడించింది. ఈ విషయం చెబుతుండగా అక్కడికి వచ్చిన శౌర్య (క్రితిక) నాకు ఇంకా ఒక రోజు షూటింగ్ పెండింగ్ ఉంది అని చెబుతూ వంటలక్కకు గుడ్ బై చెప్పింది.