డ్రగ్స్ కేసులో స్టార్ హీరోయిన్.. వైరల్ అవుతున్న హాట్ ఫోటోలు
సాండల్వుడ్లో డ్రగ్స్ రాకెట్ వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. ఈ వ్యవహారంలో ప్రధానంగా కన్నడ స్టార్ హీరోయిన్ రాగిణి ద్వివేది పేరు వినిపిస్తోంది. ఇప్పటికే ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించిన సీసీబీ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రాగిణికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
మోడల్గా కెరీర్ ప్రారంభించిన రాగిణి ద్వివేది, 2008లో ఫెమినా మిస్ ఇండియా ఫోటీల్లో రన్నరప్గా నటించింది.
2009 లో పాంటలూన్స్ ఫెమినా మిస్ ఇండియా పోటీలో పాల్గొన్న రాగిణి, రిచ్ఫీల్డ్ ఫెమినా మిస్ బ్యూటిఫుల్ హెయిర్ అవార్డును కూడా గెలుచుకుంది.
రాగిణి 2009 లో సినీరంగ ప్రవేశం చేసింది. రాగిణి తన తొలి కన్నడ చిత్రం వీర మదకారితోనే ఉత్తమ తొలి చిత్ర నటిగా గోల్డెన్ ఫిల్మ్ అవార్డును గెలుచుకుంది.
రాగిణి సూపర్ హిట్ సినిమాలు కెంపెగా గౌడ (2011), శివ (2012), బంగరి (2013), రాగిణి ఐపిఎస్ (2014) లాంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
రాగిణి ద్వివేది కర్ణాటక బెంగళూరులో నివాసం ఉంటున్న పంజాబీ కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి రాకేశ్ కుమార్ ద్వివేది హర్యానాలో జన్మించారు. ఆమె తల్లి రోహిణి భారత సైన్యంలో కల్నల్. రాగిణి మే 24, 1990 న జన్మించారు.
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రసాద్ బిదాపా 2008 లో రాగిణిని మోడలింగ్కు పరిచయం చేశారు. ఆమె లాక్మే ఫ్యాషన్ వీక్ కోసం తొలిసారిగా మోడలింగ్ చేసింది.
రాగిణి కన్నడ, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో 30 కి పైగా చిత్రాల్లో నటించింది.
రాగిణికి ఉత్తమ నటిగా రెండు ఫిలిం ఫేర్ అవార్డులు వచ్చాయి.
2019లో గాంధిగిరి సినిమాలో సినిమాలో నటించింది రాగిణి. ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది.
స్వచ్ఛ భారత్లో భాగంగా క్లీన్ బెంగళూరు క్యాంపెయిన్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తోంది రాగిణి.