అజయ్ దేవగన్ సెల్ఫీ కూడా ఇవ్వడం లేదట.. బర్త్ డే వేళ కాజోల్ ఆవేదన
`దిల్వాలే దుల్హానియా లేజాయేంగే` స్టార్ కాజోల్ తన భర్త `ఆర్ఆర్ఆర్` స్టార్ అజయ్ దేవగన్ సెల్ఫీ కోసం వెయిట్ చేస్తుందట. ఎప్పడు చూసినా ఆయన కెమెరాతోనే ఉంటున్నాడని, తాను కోరుకున్న సెల్ఫీ దొరకడం లేదని కంప్లెయింట్ చేస్తోంది కాజోల్. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్గా మారింది.
`ఆర్ఆర్ఆర్` స్టార్ అజయ్ దేవగన్, ఆయన భార్య, నటి కాజోల్ బాలీవుడ్లో బెస్ట్ కపుల్. లవ్ మ్యారేజ్ తర్వాత నుంచి వీరిద్దరు వివాదాలకు దూరంగా చాలా ఉంటారు. ఆదర్శ జంటగా నిలుస్తున్నారు.
శుక్రవారం అజయ్ దేవగన్ తన 52వ పుట్టిన రోజుని జరుపుకున్నారు. కరోనా వల్ల ఆయన నిరాడంబరంగానే బర్త్ డే సెలబ్రేట్ చేసుకోవాల్సి వచ్చింది. అయితే అజయ్ బర్త్ డే రోజు కూడా బిజీగా ఉన్నారట. తాజాగా ఈ విషయాన్ని ఆయన భార్య నటి కాజోల్ వెల్లడించారు. కెమెరాతో బిజీగా ఉన్నారని తాను సెల్ఫీ తీసుకుందామని ప్రయత్నిస్తున్నాకుదరడం లేదని చెప్పింది.
అయితే ఈ సందర్భంగా కాజోల్ తనలోని హ్యూమర్ని పంచుకుంది. తనలో ఎంతటి ఫన్నీ హ్యుమర్ ఉందో, ఎంత బాగా అభిమానులను అలరించగలదో ఒక్క పోస్ట్ తో చూపించింది.
ఆయన ఎప్పుడు కెమెరాతోనే ఉంటున్నాడని పేర్కొంది. అందులోనే ఆనందం వెతుక్కుంటున్నాడని చెప్పింది. అయినా ఫర్వాలేదు. `హ్యపీ బర్త్ డే.. ఈ రోజు.. ఎప్పటికీ` అని పేర్కొంది కాజోల్. ఈ సందర్భంగా కెమెరాతో షూటింగ్లో బిజీగా ఉన్న అజయ్ దేవగన్ ఫోటోని పంచుకుంది.
దీనికి అజయ్ దేవగన్ స్పందించారు. `మేం చాలా కాలం చెల్లిన సెల్ఫీని త్వరలో తీసుకుంటాము` అని కామెంట్ చేశాడు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య ఇన్స్టా కన్వర్జేషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అభిమానులను అలరిస్తుంది.
అజయ్ దేవగన్పై కాజోల్కి ఉన్న ప్రేమని తెలియజేస్తుంది. అంతేకాదు ఆయన కోసం వెయిట్ చేస్తున్నట్టుగా చెప్పకనే చెప్పింది. మొత్తంగా ఇది వైరల్గా మారింది.
కాజోల్, అజయ్ దేవగన్ మొదట 1995లో `హల్చల్` చిత్రంలో కలుసుకున్నారు. ఆ సమయంలోనే ఇద్దరు దగ్గరయ్యారు. మనసులు కలిశాయి. కొన్నాళ్లపాటు డేటింగ్ చేశారు.
ఎట్టకేలకు 1999లో వివాహం చేసుకున్నారు. మహారాష్ట్ర సాంప్రదాయంలో వీరి వివాహ వేడుక జరిగింది. 22ఏళ్ల దాంపత్య జీవితంలో వీరికి ఇద్దరు పిల్లలు కుమార్తె నైసా, కుమారుడు యుగ్ ఉన్నారు.
వీరిద్దరు `ఇష్క్`,`ప్యార్ తో హోనా హి థా`, `యు మి ఔర్ హమ్`,`తానాజీ` చిత్రాల్లో కలిసి నటించారు. బాలీవుడ్లో వెండితెరపై వీరి మధ్య కెమిస్ట్రీకి మంచి పేరుంది.
ఇదిలా ఉంటే కరోనా కారణంగా అభిమానులను డైరెక్ట్ గా కలుసుకోలేకపోయాడు అజయ్ దేవగన్. ఈ నేపథ్యంలో తనకు శుభాకాంక్షలు తెలిపిన అభిమానులకు, సినీ ప్రముఖులకు ధన్యవాదాలు తెలిపారు.
ప్రస్తుతం అజయ్ దేవగన్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ `ఆర్ఆర్ఆర్`లో నటిస్తున్నారు. ఇందులోని ఆయన లుక్, మోషన్ పోస్టర్ని శుక్రవారం విడుదల చేయగా, దానికి విశేష స్పందన లభిస్తుంది. మరోవైపు హిందీలో ఆయన తన దర్శకత్వంలో `మేడే` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. అలాగే `మైదాన్`, `భుజ్ః ది ప్రైడ్ ఆఫ్ ఇండియా`, `థ్యాంక్ గాడ్` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.