భర్తతో కలిసి పార్టీ.. మందేసి.. చిందేసి.. కాజల్ రచ్చ మామూలుగా లేదుగా!
కాజల్ మొన్నటి వరకు హనీమూన్ని తెగ ఎంజాయ్ చేసింది. ఇప్పుడు భర్తతో కలిసి పార్టీ చేసుకుంటుంది. అంతేకాదు పార్టీలో మందేసింది.. ఇక చిందేసింది. తాజాగా ఈ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోగా, అవి షేక్ చేస్తున్నాయి.
కాజల్ హనీమూన్ నుంచి తిరిగి వచ్చి ఇప్పుడు ముంబయిలో తన భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి ఫ్యామిలీ జీవితాన్ని మొదలు పెట్టింది. ఇటీవల ఈ అమ్మడు భర్తతో కలిసి పార్టీ చేసుకుంది.
తమ మ్యారేజ్ జరిగి నెలరోజులు పూర్తయిన సందర్భంగా వీరిద్దరు పార్టీ చేసుకున్నారు. అంతేకాదు క్రిస్మస్ నెల ప్రారంభం సందర్భంగా కూడా వీరిద్దరు పార్టీలో మునిగితేలారు.
ఈ సెలబ్రేషన్లో భాగంగా కాజల్, గౌతమ్ కలిసి ఆల్కాహాల్ తీసుకోవడంతోపాటు డాన్స్ లు చేశారు. గౌతమ్ వెనకాల ఎక్కి కాజల్ పండగ చేసుకుంది.
ప్రస్తుతం ఈ ఫోటోలను కాజల్ సోషల్ మీడియా ద్వారా పంచుకోగా, అవి చక్కర్లు కొడుతున్నాయి. కాజల్ రచ్చ మామూలుగా లేదుగా అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.
మరోవైపు తన భర్త కంపెనీకి ప్రమోషన్ స్టార్ట్ చేసింది కాజల్. ఓ ప్రాజెక్ట్ కి ప్రమోషన్ చేస్తూ తీసిన వీడియో గ్లిప్స్ ని ఇన్స్టా ద్వారా పంచుకుంది.
కాజల్, గౌతమ్ల మ్యారేజ్ అక్టోబర్ 30న ముంబయిలోని ఓ స్టార్ హోటల్ లో గ్రాండియర్ వేలో జరిగిన విషయం తెలిసిందే.
అనంతరం వీరిద్దరు హనీమూన్కి మాల్దీవులకు వెళ్ళారు. అక్కడ తెగ ఎంజాయ్ చేశారు. ఏకంగా సముద్రంలోని అక్వేరియంలో ఫస్ట్ నైట్ ఏర్పాటు చేసుకుని క్రేజీ అనిపించుకున్నారు.
అంతేకాదు సముద్రం మధ్యలో లంచ్ చేసి వాహ్ అనిపించింది. తాము అన్నింటిలోనూ స్పెషల్ అని నిరూపించుకుంది. కాజల్ ప్రస్తుతం తెలుగులో `ఆచార్య` చిత్రంలో నటిస్తుంది. తమిళంలో `భారతీయుడు 2`లో చేస్తుంది.