- Home
- Entertainment
- ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్ లో భారీ బయోపిక్ చిత్రం.. తారక్ ఎవరి పాత్రలో నటించబోతున్నారో తెలుసా ?
ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్ లో భారీ బయోపిక్ చిత్రం.. తారక్ ఎవరి పాత్రలో నటించబోతున్నారో తెలుసా ?
పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న కొత్త బయోపిక్ "మేడ్ ఇన్ ఇండియా"లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్ర పోషించబోతున్నారనే వార్త పరిశ్రమలో హాట్ టాపిక్ అయింది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Rajamouli, Jr NTR
పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న కొత్త బయోపిక్ "మేడ్ ఇన్ ఇండియా"లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్ర పోషించబోతున్నారనే వార్త పరిశ్రమలో హాట్ టాపిక్ అయింది. భారతీయ సినిమాకు పితామహుడు అయిన దాదాసాహెబ్ ఫాల్కే జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి 2023లో అధికారికంగా ప్రకటించారు.
ఈ చిత్రాన్ని మ్యాక్స్ స్టూడియోస్, షోయింగ్ బిజినెస్ కలిసి నిర్మిస్తున్నాయి. రాజమౌళి తన ట్విట్టర్ ఖాతాలో సెప్టెంబర్ 19, 2023న సినిమా ప్రకటన వీడియోను విడుదల చేశారు. “ఈ కథ విన్నప్పుడే నా మనసును తాకింది. ఒక బయోపిక్ తీయడం సులభం కాదు. అది కూడా ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా గురించిన కథ అయితే మరింత కష్టమే. కానీ మా బృందం సన్నద్ధంగా ఉంది,” అని రాజమౌళి పేర్కొన్నారు.
SS Karthikeya
ఇప్పుడు వచ్చిన తాజా సమాచారం ప్రకారం, జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో దాదాసాహెబ్ ఫాల్కే పాత్ర పోషించేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. నిర్మాతలు వరుణ్ గుప్తా, ఎస్.ఎస్. కార్తికేయ కలిసి జూనియర్ ఎన్టీఆర్కు కథ వినిపించారని తెలుస్తోంది. వీళ్ళిద్దరూ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. రాజమౌళి కూడా ఇన్వాల్వ్ అవుతారు. కానీ ఈ చిత్రానికి నితిన్ కక్కర్ దర్శకత్వం వహించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. "ఎన్టీఆర్ కథ విన్న వెంటనే ఆకర్షితులయ్యారు. దాదాసాహెబ్ ఫాల్కే గురించి తెలియని అనేక విషయాలు ఈ కథలో ఉన్నాయని, భారతీయ సినిమా అభివృద్ధి గురించి వివరంగా చెప్పడంతో ఎన్టీఆర్ ఆశ్చర్యపోయినట్లు తెలుస్తోంది.
Jr NTR
అంతేకాకుండా, ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్పై దర్శకుడు రాజమౌళి, ఆయన కుమారుడు కార్తికేయ, నిర్మాత వరుణ్ గుప్తాపై గల అభిమానంతో మరింత ఆసక్తి చూపించినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కానీ ఇండస్ట్రీ వర్గాల్లో ఈ వార్త తీవ్ర చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే పూర్తి వివరాలు వెలువడే అవకాశం ఉంది.
Jr NTR
ఎన్టీఆర్ ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో స్టూడెంట్ నంబర్ 1, సింహాద్రి, యమదొంగ, ఆర్ఆర్ఆర్ చిత్రాల్లో నటించారు. అయితే తొలిసారి ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వం వహించకుండా ఆయన ఇన్వాల్వ్ అవుతున్న చిత్రానికి ఓకె చెప్పినట్లు తెలుస్తోంది.