సౌత్ ఎంట్రీపై హింట్ ఇచ్చిన జాన్వీ కపూర్, ఎన్టీఆర్ తో సినిమా ఫిక్స్ అయినట్టేనా...?
సౌత్ ఎంట్రీపై హింట్స్ ఇస్తుంది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. చాలా కాలంగా జాన్వీ కపూర్ సౌత్ సినిమాల్లో ముఖ్కంగా తెలుగుసినిమాలో నటిస్తుందంటూ వార్తలు వినిపిస్తూ వచ్చాయి. ఇక ఈ విషయంలో జాన్వీ ఏమన్నదంటే..?
వరుస సినిమాలతో దూసుకుపోతోంది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే ఆమె సౌత్ ఎంట్రీ గురించి కూడా రకరకాల గాసిప్స్ వినిపించాయి. ఎన్టీఆర్ తో కొరటాల తెరకెక్కించే సినిమాలో జాన్వీ నటిస్తోందంటూ రూమర్స్ వినిపించాయి. కాని ఈ కాంబోపై ఎటువంటి అనౌన్స్ మెంట్ రాలేదు.
ఇక అదంతా నిజం కాదంటూ.. జాన్వీ సౌత్ ఎంట్రీపై తమతో ఎవరూ సంప్రదించలేదంటూ బోనీ కపూర్ ఒ సందర్భలో వ్యాఖ్యానించడంతో.. కొంత క్లారిటీ వచ్చింది అయితే రీసెంట్ గా సౌత్ ఎంట్రీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది జాన్వీ కపూర్. అటు ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్ ఇంత వరకూ ఫిక్స్ అవ్వకపోవడా.. ఇటు జాన్వీ కామెంట్స్ తో.. ఈకాంబోపై మళ్ళీ ఆశలు చిగురిస్తున్నాయి.
శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. అంతే అందరు హీరోయిన్లలా కాకుండా..గ్లామర్ పాత్రలతో పాటు నటన ప్రధాన్యమున్న పాత్రలు చేస్తూ బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట గా ఆమె నటించిన మిల్లీ రిలీజై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ జాన్వీ నటనకు మంచి మార్కులే పడ్డాయి.
Janhvi Kapoor
రీసెంట్ గా ఈ బాలీవుడ్ బ్యూటీ చెన్నైలోని ఓ స్టోర్ లాంచ్ ఈవెంట్కు గెస్ట్గా వెళ్లింది. ఈ ఈవెంట్ లో మీడియాతో మాట్లాడిన జాన్వీ..కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను విషయాలను పంచుకుంది. కాగా ఈ కార్యక్రమంలో జాన్వీని అప్కమింగ్ సినిమాల గురించి అడగ్గా.. తాను నటిస్తున్న సినిమాలతో పాటు సౌత్ సినిమాలో నటించాలని ఆశిస్తున్నట్లు తెలిపింది.
దాంతో కొరటాలశివ-ఎన్టీఆర్ సినిమాలో జాన్వీ హీరోయిన్గా ఫిక్స్ అయ్యి ఉంటుంది అని అంతా భావిస్తున్నారు. త్వరలో ఈ విషయంలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం కూడా ఉండోచ్చంటున్నారు. కాని ఇప్పటి వరకూ వీటిపై ఎవరూ స్పందించలేదు. కాగా తాజాగా జాన్వీ త్వరలోనే సౌత్ సినిమాలో నటించాలని ఆశిస్తున్నట్లు తెలిపింది.
ఇటు ఎన్టీఆర్ సినిమాలో కూడా ఏ హీరోయిన్ ను ఇప్పటి వరకూ ఫిక్స్ చేయలేదు. అటు జాన్వీ స్టేట్ మెంట్ చూస్తూ.. ఈమూవీలోనే హీరోయిన్గా ఆల్మోస్ట్ ఆమెనే కన్ఫార్మ్ అయినట్లు అనుకుంటున్నారు ఫ్యాన్స్.
ఇక ఈ విషయంలో పక్కా క్లారిటీ రావాలి అంటే కొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే. ప్రస్తుతం జాన్వీ కపూర్ బాలీవుడ్ లో బావల్, మిస్టర్ అండ్ మిస్టర్స్ మహీ సినిమా చేస్తుంది. వరుణ్ ధావన్తో కలిసి చేసిన బావల్ వచ్చే ఏడాది ఏప్రిల్ 9న రిలీజ్ కానుంది.