స్ఫూర్తిదాయకంగా `గుంజన్ సక్సెనా`.. ఫిదా చేసిన జాన్వీ
ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్పై కరణ్ జోహార్ నిర్మించిన ఈ సినిమాకు శరణ్ శర్మ దర్శకుడు. ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా ట్రైలర్తో మరింత హైప్ క్రియేట్ చేసింది. ఈ మూవీ ఆగస్టు 12న నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది. ఈ సినిమాతో జాన్వీ కపూర్ మరోసారి ఆకట్టుకోవటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బయోపిక్ల సీజన్ నడుస్తోంది. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులతో పాటు పెద్దగా పేరు రాకపోయినా అత్యున్నత విజయాలు సాధించిన ప్రముఖుల జీవిత కథలను కూడా సినిమాలుగా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన విద్యా బాలన్ శకుంతల దేవి సినిమాకు సూపర్ హిట్ టాక్ రాగా తాజాగా మరో ఆసక్తికర బయోపిక్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది.
ఎయిర్ ఫోర్స్లో తొలి మహిళా పైలెట్గా, కార్గిల్ గర్ల్గా పేరు తెచ్చుకున్న గుంజన్ సక్సెనా జీవిత కథ ఆథారంగా ఆమె పేరుతోనే సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో గుంజన్ పాత్రలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటించింది. కార్గిల్ యుద్ధ సమయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన చీతా హెలికాఫ్టర్స్కు పైలెట్గా వ్యవహరించింది గుంజన్. అయితే ఈ సినిమాలో గుంజన్ జీవితంలోని విభిన్న కోణాలను ఆవిష్కరించారు.
చిన్నతనం నుంచి గుంజన్ పైలెట్ కావాలని కలలు కనటం, ఆ ప్రయాణంలో ఆమెకు ఎదురైన సమస్యలు. తరువాత ఎయిర్ ఫోర్స్లో జాయిన్ కావటం, అక్కడ మహిళలకు ప్రత్యేక గదులు, టాయిలెట్లు లేకపోవటం లాంటి సమస్యల ఇలా ఆమె జీవితంలో ఎదురైన ప్రతీ అంశాన్ని సినిమాలో అద్భుతంగా చూపించారు. ఎమోషనల్ జర్నీలా సాగే ఈ సినిమా ఎలా ఉండబోతుందో ట్రైలర్లోనూ చూపించారు చిత్రయూనిట్.
ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్పై కరణ్ జోహార్ నిర్మించిన ఈ సినిమాకు శరణ్ శర్మ దర్శకుడు. ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా ట్రైలర్తో మరింత హైప్ క్రియేట్ చేసింది. ఈ మూవీ ఆగస్టు 12న నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది. ఈ సినిమాతో జాన్వీ కపూర్ మరోసారి ఆకట్టుకోవటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.