Guppedantha Manasu: ఏంజెల్ ని పెళ్లి చేసుకుంటానంటూ షాకిచ్చిన రిషి.. కొడుకు చేతిలో మోసపోయిన ఫణీంద్ర!
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి టిఆర్పి రేటింగ్ ని సంపాదించుకొని ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. అధికారం కోసం కన్నతండ్రిని కూడా మోసం చేయడానికి సిద్ధపడిన ఒక కొడుకు కథ ఈ సీరియల్. ఇక ఈరోజు సెప్టెంబర్ 12 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
ఎపిసోడ్ ప్రారంభంలో ఈ సమస్య నుంచి బయటపడటం ఎలా అంటాడు మహేంద్ర. నాక్కూడా అర్థం కావడం లేదు అంటాడు రిషి. అయితే నీకు ఇష్టం లేకపోయినా పెళ్ళికి ఒప్పుకుంటావా అని అడుగుతాడు మహేంద్ర. ఆ నిమిషానికి నాకు ఏమనిపిస్తే అది చేస్తాను. మీరు కూడా వస్తారు కదా చూద్దురుగాని. అయిన అయినవాళ్లే నన్ను మోసం చేశారు.
ఆ సమయంలో వాళ్ళు నన్ను చేరదీసి సొంత మనిషిలా చూసుకున్నారు. వాళ్ళకి నేను ఎదురు చెప్పలేను అంటాడు రిషి. మాకేంటి ఈ శిక్ష అంటుంది జగతి. శిక్ష వేసింది మీరు అనుభవిస్తున్నది నేను. అయినా మళ్లీ చెప్తున్నాను అక్కడికి వచ్చి మీరు ఎవరు ఏమి మాట్లాడటానికి వీల్లేదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి. రిషి ఏంటి అలా మాట్లాడుతున్నాడు అంటాడు మహేంద్ర.
ఆయన ఏంజెల్ ని పెళ్లి చేసుకుంటే అందరికంటే నేనే ఎక్కువగా సంతోషిస్తాను అంటూ బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వసుధార. మరోవైపు అందంగా ముస్తాబైన ఏంజెల్ దగ్గరికి వచ్చిన విశ్వనాథం మనవరాలను చూసి పెళ్లికళ వచ్చేసింది అంటూ ఆనందపడతాడు. ఇంతలో పంతులుగారు వచ్చారని తెలిసి ఇద్దరు హాల్లోకి వస్తారు.
రిషి కూడా అప్పుడే వస్తాడు. వెనుకగా వచ్చిన మహేంద్ర వాళ్ళని చూసి కంగారు పడతాడు విశ్వనాథం. ఆక్సిడెంట్ జరిగిందని తెలుసుకొని బాధపడతాడు. రిషి పెళ్లికి ఒప్పుకున్నాడు అన్న దగ్గర నుంచి ఎందుకు నువ్వు కాంటాక్ట్ లో లేవు అని వసుధారని అడుగుతుంది ఏంజెల్. సరే ఇప్పుడు అందరూ వచ్చేసారు కదా ఇంక ఈ టాపిక్ వదిలేయ్ అంటాడు విశ్వనాథం.
పంతులుగారు ముహూర్తాలు పెట్టేయమంటారా అని అడగడంతో రిషి ఫ్రెష్ అయి వస్తాడు అప్పుడు పెడుదురుగాని అని చెప్తాడు విశ్వనాథం. రిషి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. వెళ్తున్న రిషి ని చూస్తూ తమ రిలేషన్ గురించి గుర్తు చేసుకుంటూ ఉంటుంది వసుధార. మన బంధం గురించి కీలక నిర్ణయం తీసుకునే సమయం ఇది, ఇక అంతా మీ చేతుల్లోనే ఉంది అని మనసులో అనుకుంటుంది.
మరోవైపు డిబిఎస్టి కాలేజీకి వస్తాడు ఎంఎస్ఆర్. ఎన్నాళ్ళ నుంచో కలలు కంటున్న ఈ కాలేజీ ఇప్పుడు నా వశం కాబోతుంది అని అనుకుంటాడు. ఇంతలో ఫణీంద్ర, శైలేంద్ర కూడా వస్తారు. ఫణీంద్ర కోపంగా ఎమ్మెస్సార్ దగ్గరికి వచ్చి ఏంటి సడన్గా రమ్మన్నావు అయినా నువ్వు ఎందుకు ఈ కాలేజీకి వచ్చావు అని అడుగుతాడు. అప్పుడు తను ఈ కాలేజీకి అప్పిచ్చిన విషయం చెప్తాడు ఎమ్మెస్సార్.
ఏంటి శైలేంద్ర ఇది, నువ్వు నీ ఫ్రెండ్ దగ్గర నుంచి తెచ్చాను అన్నావు అంటూ కొడుకుని నిలదీస్తాడు ఫణింద్ర. నేను డబ్బు తెచ్చింది నా ఫ్రెండ్ దగ్గరే డాడ్. కానీ వాడి వెనుక ఎమ్మెస్సార్ ఉన్నాడని నాకు తెలియదు అంటూ అమాయకంగా చెప్తాడు. అప్పుడు ఎమ్మెస్సార్ మీద మోసం చేశావు అంటూ కోపంతో రగిలిపోతాడు ఫణీంద్ర. మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేసే వాళ్ళు ఉంటూనే ఉంటారు.
మోసపోవటం మీ తప్పు అంటూ కార్ లోంచి డాక్యుమెంట్స్ తీసి నాతో లోపలికి రండి అంటూ ఆర్డర్ వేసినట్లు చెప్తాడు. అసలు నువ్వు లోపలికి రావడమేంటి, నీతో మాటలు ఏంటి అంటూ కోప్పడతాడు ఫణీంద్ర. లోపలికి వస్తే మీకే తెలుస్తుంది అంటూ అక్కడ నుంచి లోపలికి బయలుదేరుతాడు ఎమ్మెస్సార్. అతనిని ఫాలో అవుతారు తండ్రి కొడుకులు.మరోవైపు ఫ్రెష్ అయ్యి కిందికి వస్తాడు రిషి.
ఇప్పుడు ముహూర్తాలు పెట్టండి అంటాడు విశ్వనాథం. అప్పుడు రిషి లేచి పంతులు గారికి డబ్బు ఇచ్చి మీరు ఇప్పుడు ఏమి ముహూర్తాలు పెట్టక్కర్లేదు దయచేసి వెళ్లిపోండి అంటాడు. రిషి ప్రవర్తనకి ఆశ్చర్యపోతారు విశ్వం ఏంజెల్. ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంటాడు విశ్వనాథం.నేను మీతో మాట్లాడాలి ముందు ఆయనని పంపించేయండి అని చెప్పడంతో పంతులు గారిని పంపించేస్తాడు విశ్వనాథం.
ఆ తర్వాత మహేంద్ర వాళ్ళని చూపిస్తూ వాళ్ళు నా ఆత్మీయులు. వాళ్ళు ఇక్కడికి వచ్చింది కార్యక్రమం చూసి వెళ్లిపోవటానికి కాదు. కీలకమైన మలుపులో నన్ను హెచ్చరించడానికి వచ్చారు అని చెప్తాడు రిషి. అవును అంటూ మహేంద్ర ఏదో మాట్లాడబోతుంటే మీరేమీ మాట్లాడకండి, చెప్పవలసింది నేను అంటాడు రిషి. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.