`జబర్దస్త్` నూకరాజు కోసం కెరీర్ని వదులుకున్న అన్న, తండ్రి లేని ప్రసాద్ని కొడుకులా పెంచిన మేనమామ..
`జబర్దస్త్` కమెడీయన్లు నూకరాజు, ప్రసాద్ బుల్లితెరపై తమదైన కామెడీతో ఎంతగా నవ్విస్తున్నారో తెలిసిందే. వారి సక్సెస్ వెనకాల ఎమోషనల్ జర్నీ ఉంది. ఎంతో త్యాగం ఉంది. ఆ ఎమోషనల్ జర్నీని బయటపెట్టారు.
`జబర్దస్త్` కామెడీ మోస్ట్ సక్సెస్ఫుల్ షో. కామెడీకి కేరాఫ్. అనేక విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ దాదాపు ఎనిమిదేళ్లుగా విజయవంతంగా రన్ అవుతుంది. ఈ షోలో ఎంతో మంది కమెడీయన్లకి కెరీర్ని అందించింది. ఇందులో ప్రస్తుతం పాపులర్ కమేడియన్లలో నూకరాజు, ప్రసాద్ లది ప్రత్యేక స్థానం.
తాజాగా సుమ యాంకర్గా ప్రసారమయ్యే `క్యాష్` ప్రోగ్రామ్లో పాల్గొన్నారు. నూకరాజు, ప్రసాద్లతోపాటు ఇమ్మాన్యుయెల్, బాబులు తమ ఫ్యామిలీస్తో కలిసి ఈ షోలో సందడి చేశారు.
సుమతో ఆద్యంతం సరదాగా, ఫన్నీ, మూడు పంచ్లు, ఆరు నవ్వులా ఈ షో సాగింది. సుమ సైతం తనదైన స్టయిల్లో పంచ్లతో అదరగొట్టింది. నవ్వులు పూయించింది.
ఇమ్మాన్యుయెల్, నూకరాజు, ప్రసాద్, బాబులు ఒకరిపై ఒకరు వేసుకున్న పంచ్లు సైతం బాగా పేలాయి. వారి ఫ్యామిలీ మెంబర్స్ పైన కూడా సెటైర్లతో కడుపుబ్బ నవ్వించారు.
ఈ సందర్భంగా తమ ఎమోషనల్ జర్నీతో అందరి హృదయాలను బరువెక్కించారు. నూకరాజు తమ పేరెంట్స్ కంటే అన్న కాళ్లే మొక్కుతానని తెలిపాడు. స్టేజ్పై అన్నయ్య కాళ్లు మొక్కారు.
తన కోసం,తమ తల్లిదండ్రుల కోసం తన కెరీర్ని త్యాగం చేశాడని చెప్పి ఎమోషనల్ అయ్యారు. తాను ఇక్కడ ఉండేందుకు వాళ్లు జీవితం సాక్రిఫైజనే అని వెల్లడించారు.
తన జాబ్ వదిలేసి అమ్మానాన్నలకు ఆరోగ్యం బాగా లేదని వాళ్ల కోసం ఇంటి వద్దే ఉన్నాడని తెలిపారు. దీంతో నూకరాజు బ్రదర్ కన్నీళ్లు పెట్టుకున్నారు.
మరో కమెడీయన్ ప్రసాద్ సైతం ఎమోషనల్కి గురి చేస్తూనే నవ్వులు పూయించారు. తన తండ్రి చిన్నప్పుడే చనిపోయాడని, ఆ సమయంలో తన మేనమామ అన్నీ తానై తనని పెంచినట్టు వెల్లడించారు.
మేనమామ లేకపోతే తన స్థానం వేరే అని, అదే సమయంలో ఇంకా గొప్పగా ఉండేవాడినని పంచ్ వేసి ఎమోషన్ని ఒక్కసారిగా దించేశాడు. ఇప్పుడిది వైరల్ అవుతుంది.
ఈ లేటెస్ట్ `క్యాష్` ప్రోగ్రామ్ ఫ్యామిలీ స్పెషల్గా రూపొందించారు. ఇది వచ్చే శనివారం ప్రసారం కానుంది. ఇప్పుడు ప్రోమో తెగ ఆకట్టుకుంటోంది.