వేదికపై అందరూ చూస్తుండగానే ఎన్టీఆర్ కాళ్లపై పడ్డ జబర్ధస్త్ కమెడియన్!
జబర్ధస్త్ కమెడియన్ రైసింగ్ రాజు ఎన్టీఆర్ కాళ్లపై పడడం సంచలనంగా మారింది. ఎన్టీఆర్ కంటే వయసులో పెద్దవాడైన రైసింగ్ రాజు చేసిన పనికి ఎన్టీఆర్ తో పాటు వేదికపై ఉన్నవారు కూడా షాక్ అయ్యారు. ఇంతకీ రైసింగ్ రాజు ఎన్టీఆర్ కాళ్లపై ఎందుకు పడ్డాడంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ యాన్వల్ కాన్ఫరెన్స్ కి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జబర్ధస్త్ కమెడియన్స్ హైపర్ ఆది, రైసింగ్ రాజు మరియు శాంతి స్వరూప్ పాల్గొన్నారు.
ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే జరిగే అనర్ధాలు, రోడ్డు ప్రమాదంలో అయినవారిని కోల్పోతే కలిగే వేదన గురించి ఎన్టీఆర్ తన ప్రసంగం ద్వారా వివరించారు.
కార్యక్రమం చివర్లో ఎన్టీఆర్ తనతో పాటు పాల్గొన్న హైపర్ ఆది, రైసింగ్ రాజు మరికొందరిని సన్మానించడం జరిగింది. మొదట హైపర్ ఆదికి శాలువా కప్పి మెమెంటోతో పాటు ఓ మొక్కను ఇవ్వడం జరిగింది.
హైపర్ ఆది తరువాత వేదికపైకి వెళ్లిన రైసింగ్ రాజు ఎన్టీఆర్ కాళ్ళను పట్టుకున్నారు. వయసులో తనకంటే పెద్దవాడైన రైసింగ్ రాజు అలా చేయడం ఎన్టీఆర్ కి నచ్చలేదు.
వేదిక కావడంతో రైసింగ్ రాజుకు మీరు పెద్ద వారు అలా చేయకూడదని అర్థం అయ్యేలా చెప్పాడు. ఓ పెద్ద స్టార్ హీరో అన్న హోదాలో రైసింగ్ రాజు ఎన్టీఆర్ కాళ్లకు మొక్కడం జరిగింది.
ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ విడుదల ఇప్పటికే లేటు కాగా, దర్శకుడు రాజమౌళి త్వరగా పూర్తి చేసే పనిలో ఉన్నారు.