కుర్ర హీరోను పెళ్లి చేసుకోనున్న కియారా అద్వానీ... ఈ విషయంపై సిద్ధార్థ్ మల్హోత్ర ఓపెన్ కామెంట్
కియారా అద్వానీ మరియు సిద్ధార్థ్ మల్హోత్రా డేటింగ్ గురించి పుకార్లు చాలా కాలంగా వినిపిస్తున్నాయి.ఈ విషయంపై సిద్దార్థ్ మల్హోత్రా స్వయంగా స్పందించారు.
షేర్షా జంట కియారా అద్వానీ మరియు సిద్ధార్థ్ మల్హోత్రా సినీ పరిశ్రమలో ప్రేమ పక్షులుగా ఎప్పటి నుండో పిలవబడుతున్నారు. అయితే ఎప్పుడు కూడా ఈ జంట తమ రిలేషన్ పై ఓపెన్ కాలేదు.
పార్టీలకు, వేడుకలలో కలిసి కనిపంచే ఈ కపుల్, ముంబైలో చక్కర్లు కొడుతూ అనేక మార్లు కెమెరా కంటికి చిక్కారు.
సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు కూడా చాలా కాలంగా వినిపిస్తున్నాయి. కాగా ఈ ప్రశ్నకు సిద్దార్థ్ మల్హోత్రా స్వయంగా సమాధానం చెప్పారు.
సిద్ధార్థ్ మల్హోత్రాను మీరు కియారాను వివాహం చేసుకోనున్నారట కదా.. అని ఓ బాలీవుడ్ మీడియా అడిగిన ప్రశ్నకు నా పెళ్లి ఎప్పుడు, ఎలా జరుగుతుందో ముందే చెప్పడానికి నేను జ్యోతిష్కుడిని కాదు. ముఖ్యంగా నేను ఎవరిని పెళ్లి చేసుకుంటాననే సంగతి ఇంకా నాకు తెలియదు అన్నారు.
పరోక్షంగా కియారాతో తనకు ఎలాంటి బంధం లేదని, ఇక తన పెళ్లి, ఎప్పుడు, ఎవరితో జరుగుంతుందో అప్పుడే చెప్పలేనని సిద్దార్థ్ మల్హోత్రా మీడియా సాక్షిగా క్లారిటీ ఇచ్చారు.
ఇక మల్హోత్రా మిషన్ మజ్ను మూవీలో రష్మిక మందానతో జతకట్టాడు. ఇక కియారా భూల్ భూల్యా, జగ్ జగ్ జీయో మరియు మరికొన్ని భారీ బడ్జెట్ చిత్రాలలో కనిపించనుంది. రామ్ చరణ్- శంకర్ మూవీలో ఆమె హీరోయిన్ గా ఎంపికైన విషయం తెలిసిందే.