- Home
- Entertainment
- Kumbhakarna: కుంభకర్ణుడు అంత గొప్పవాడా, అయినా శ్రీరాముడు భయంకర యుద్ధం చేసి అతడిని ఎందుకు చంపాడో తెలుసా ?
Kumbhakarna: కుంభకర్ణుడు అంత గొప్పవాడా, అయినా శ్రీరాముడు భయంకర యుద్ధం చేసి అతడిని ఎందుకు చంపాడో తెలుసా ?
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి చిత్రంలో రామాయణానికి సంబంధించిన అత్యంత కీలకమైన ఎపిసోడ్ ఉండబోతోంది. శ్రీరాముడు, కుంభకర్ణుడికి మధ్య జరిగిన యుద్దని జక్కన్న చూపించబోతున్నారు.

Kumbhakarna
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న వారాణసి చిత్రం వరల్డ్ వైడ్ గా సినీ అభిమానుల్లో అంచనాలు పెంచేస్తోంది. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ గెలుపు తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న చిత్రం కావడంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పటిలాగే జక్కన్న ఈసారి కూడా ఒక విభిన్నమైన కాన్సెప్ట్ తో మూవీ తెరకెక్కిస్తున్నారు. వారాణసి చిత్రం టైం ట్రావెల్ అంశంతో, ప్రపంచం మొత్తం తిరిగే సాహస వీరుడి కథగా ఉండబోతోంది.
రాముడు, కుంభకర్ణుడు మధ్య యుద్ధం
ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక వీరుడిగా, అదే విధంగా శ్రీరాముడిగా కనిపించబోతున్నారు. రామాయణంలోని అత్యంత భీకర యుద్ధం అయిన కుంభకర్ణుడి ఎపిసోడ్ హైలైట్ గా నిలవబోతోంది. దాదాపు 25 నిమిషాల నిడివితో రాముడు, కుంభకర్ణుడి యుద్ధం ఉండబోతోంది అని జక్కన్న ఇప్పటికే ప్రకటించారు. దీనితో ఆ ఎపిసోడ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అసలు రామాయణంలో రాముడు, కుంభకర్ణుడిని ఎందుకు చంపారు ? అతడు మంచివాడా చెడ్డవాడా ? వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి యుద్ధం జరిగింది అనే అంశాలు ఇప్పుడు చూద్దాం.
దిక్కుతోచని స్థితిలో రావణుడు
రాముడితో రావణుడి తరపున వాళ్ళు ఎన్ని సార్లు పోరాడినా వాళ్లకు పరాజయమే ఎదురుతూ ఉంటుంది. రావణుడి కుమారుడు అతికాయుడిని లక్ష్మణుడు ఘోరంగా చంపేస్తారు. దీనితో రావణుడికి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడే తన సోదరుడు కుంభకర్ణుడిని యుద్ధంలోకి దించాలి అని రావణుడు భావిస్తాడు. అప్పటికే కుంభ కర్ణుడు కొన్ని నెలలుగా గాఢ నిద్రలో ఉంటాడు. రావణుడు కుంభకర్ణుడిని బలవంతంగా నిద్ర లేపి జరిగిన విషయం చెబుతాడు.
కుంభకర్ణుడు ఎంత మంచివాడో తెలుసా ?
కుంభకర్ణుడు స్వతహాగా చాలా మంచివాడు. సీతని అపహరించి తీసుకురావడం నీవు చేసిన పెద్ద తప్పు. అలా చేసి ఉండాల్సింది కాదు అని హితవు పలుకుతాడు. కుంభకర్ణుడి మంచి గుణానికి ఇదే నిదర్శనం. కానీ యుద్ధం ఇంటి గుమ్మం వరకు వచ్చేసింది. నీ తరుపున నిలబడాల్సిన బాధ్యత నాకు ఉంది అంటూ కుంభ కర్ణుడు తన సోదరుడిపై ప్రేమ ప్రదర్శిస్తాడు. శ్రీరాముడితో, వానర సేనతో యుద్ధంలోకి దిగుతాడు. యుద్ధరంగంలోకి అడుగుపెట్టగానే కుంభకర్ణుడు చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు. తన భారీ కాయంతో వానర సేనను నలిపేస్తుంటాడు. అంగదుడు, హనుమంతుడు, సుగ్రీవుడు లాంటి వానర వీరులు కుంభకర్ణుడిని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారు. కానీ అతడిని నిలువరించడం వారికి సాధ్యం కాదు. కొంత వరకు గాయపరచగలుగుతారు అంతే. సుగ్రీవుడిని కుంభకర్ణుడు ఆల్మోస్ట్ చంపినంత పని చేస్తాడు.
రాముడు, కుంభకర్ణుడు మధ్య దద్దరిల్లే యుద్ధం
వానర సైన్యం కుంభకర్ణుడి ధాటికి భయంతో పరుగులు తీస్తుంటారు. పరిస్థితి చేదాటిపోతుండడంతో రాముడు రంగంలోకి దిగక తప్పదు. చాలా సేపు రాముడికి, కుంభ కర్ణుడికి మధ్య భయంకర యుద్ధం జరుగుతుంది. కుంభకర్ణుడి గర్జన, రాముడి పరాక్రమంతో ఇరువైపు సైన్యాలు కంపించిపోతాయి. దీనితో శ్రీరాముడు తన అమ్ములపొది లోనుంచి అంత్యత శక్తివంతమైన వాయువ్యాస్త్రాన్ని సంధించి కుంభకర్ణుడి చేతిని నరికేస్తాడు. మరో అస్త్రంతో రెండో చేతిని కూడా ఖండిస్తాడు. రెండు చేతులు లేకపోయినా కుంభకర్ణుడు యుద్ధం ఆపడు. పోరాడుతూనే ఉంటాడు. ఆ తర్వాత రాముడు అతడి రెండు కాళ్ళని కూడా తెగనరికేస్తాడు. చివరగా శ్రీరాముడు దేవేంద్రుడి వరం అయిన ఐంద్రాస్త్రాన్ని శరవేగంగా సంధించి కుంభకర్ణుడి శిరస్సు ఖండిస్తాడు. ఆ వేగానికి కుంభకర్ణుడి తల సముద్రంలో వెళ్లి పడుతుంది. అతడి భారీ కాయం సముద్రంలో మునిగిపోతుంది. కుంభకర్ణుడు గొప్పవాడైనప్పటికీ రావణుడు చేసిన తప్పుకు కొమ్ము కాయడంతో ఘోరమైన చావు తప్పలేదు. వింటుంటేనే గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఈ ఎపిసోడ్ ని రాజమౌళి వారాణసి మూవీలో ఎలా తెరకెక్కించారు అనే క్యూరియాసిటీ పెరిగిపోతోంది.

