సైకిల్ చూస్తే ఆమెకు కాలుతుంది... ఆది సెటైర్ కి షాకైన రోజా..!
జబర్దస్త్ లో హైపర్ ఆది పంచ్ ల పవర్ అందరికీ తెలిసిందే. నాన్ స్టాప్ పంచ్ లతో నవ్వించే హైపర్ ఆది స్కిట్ కోసం షో మొత్తం చూసేవారు కూడా ఉన్నారు. తన టీం మెంబెర్స్ పై ఆయన వేసే జోకులు మంచి హాస్యం పంచుతాయి. ఐతే ఆయన పంచ్ ల దాడి అప్పుడప్పుడు జడ్జెస్ పైన కూడా ఉంటుంది.
జబర్దస్త్ కామెడీ షోలో హైపర్ ఆది స్కిట్స్ కి ఉన్న డిమాండ్ వేరు. తన టీం మెంబర్స్ పై ఆయన నాన్ స్టాప్ గా కురిపించే పంచులతో కామెడీ హోరెత్తాల్సిందే. కాంటెంపరరీ విషయాలను బేస్ చేసుకొని ఆది సృష్టించే జోకులు చాలా ఫన్నీగా ఉంటాయి. జబర్దస్త్ కామెడీ షోతో వచ్చిన ఫేమ్ తో బుల్లితెరపై సూపర్ ఫార్మ్ లో కొనసాగిస్తున్నాడు హైపర్ ఆది.
తాజాగా బుల్లితెర సక్సెస్ ఫుల్ షోలలో ఒకటైన ఢీ లోకి ఎంట్రీ ఇచ్చారు. యాంకర్ ప్రదీప్,సుధీర్ లతో జాయినై షోని సరికొత్తగా నడిపిస్తున్నారు. వీరి ముగ్గురి షార్ట్ కామెడీ స్కిట్స్ షోకి మరింత ఆదరణ తీసుకువస్తున్నాయి.
ఇక ఈ షోలో హైపర్ ఆది మరియు వర్షిణిల రొమాన్స్ మరొక ఆకర్షణ. సుధీర్ మరియు రష్మీ రొమాన్స్ ప్రేక్షకులకు మొహం మొత్తేయగా కొత్తగా ఆది, వర్షిణి జంట, ఆయాంగిల్ లో అలరించే బాధ్యత తీసుకున్నారు. వీరికి త్వరలో పెళ్లి కూడా జరుగుతుందనే ప్రచారం కూడా జరుగుతుంది.
హైపర్ ఆది పంచ్ ల దాడి యాంకర్స్ పైన కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి ఆది వేసే పంచులకు యాంకర్స్ ఏడవలేక నేవ్వేస్తుంటారు. ఆది పంచ్ ల దాడికి జడ్జెస్ కూడా మినహాయింపు కాదు. చాలా సార్లు జబర్దస్త్ జడ్జ్ ఎమ్మెల్యే రోజాను ఆయన టార్గెట్ చేయడం జరిగింది. తాజా షోలో ఆది వెంకటేష్ బ్లాక్ బస్టర్ మూవీ ప్రేమించుకుందాం రా సినిమాకి మీమ్ చేశారు. దాని కోసం ఆయన సైకిల్ పై ఎంట్రీ ఇవ్వడం జరిగింది. వస్తూనే ఆది 'కొంచెం ఏసీ పెంచండి, రోజాగారికి సైకిల్ చూస్తే మండుతుంది' అని సెటైర్ వేశాడు. ఆది వేసిన ఆ పంచ్ కి ఎలా రియాక్ట్ అవ్వాలో ఆమెకు అర్థం కాలేదు. జనసేన అభిమానైన ఆది పంచ్ దాడి ఆమెపై తరచుగా ఉంటుంది.