ఆ 30లో ఆయనకొకటి...త్వరలో ఎమ్మెల్యే కాబోతున్న హైపర్ ఆది, ఇకపై అలా పిలవాలేమో!
జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదికి పవన్ కళ్యాణ్ బంపర్ ఆఫర్ ఇచ్చాడని సమాచారం. ఆయన 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.
Hyper Aadi
టీడీపీతో జనసేన పొత్తు అనివార్యమే. పొత్తు ఉండదని జనాల్లో, జనసైనికుల్లో ఏ మూలనో ఉన్న అపోహను రణస్థలం యువశక్తి సభ సాక్షిగా పవన్ తొలగించేశారు. ఇప్పుడు ప్రజలకు ఏ పక్షాన నిలబడాలి అనే దానిపై ఒక క్లారిటీ వచ్చేసింది. పొత్తు పెట్టుకోవాలని మనసులో గట్టిగా ఉన్నప్పుడు దాన్ని బయటకు చెప్పేయడమే బెటర్. ఎన్నికలకు ముందు వరకు ఆశ కలిగించి అప్పుడు ప్రకటిస్తే... అసలుకే ఎసరొస్తుంది. సంధితో కోరుకుంటున్న ప్రయోజనాలు దక్కకపోగా ప్రతికూల ప్రభావం చూపుతుంది.
Janasena
నిజానికి పరోక్షంగా పవన్(Pawan Kalyan) ఎప్పటి నుండో హింట్ ఇస్తున్నారు. ప్రజావ్యతిరేక ఓట్లు చీల్చేది లేదని చెప్పడం ద్వారా... పొత్తు ఉంటుందని మొదటి హింట్ వదిలారు. ఇక ప్యాకేజీ తీసుకున్నాను అంటే చెప్పుతో కొడతా... అనేది సెకండ్ హింట్. నేను చంద్రబాబుతో మళ్ళీ కలవడం ఖాయమే, మీకు సిగ్గుంటే నన్ను ప్యాకేజీ అనొద్దని పవన్ డిమాండ్. బాబు దగ్గర పవన్ డబ్బులు తీసుకుంటున్నాడని జనాలు బలంగా నమ్మే కామెంట్స్ చేయొద్దని గట్టిగా ప్రత్యర్థులను వేడుకోవడం లాంటిది.
Janasena
అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉండగా... క్షేత్ర స్థాయిలో టీడీపీ-జనసేన వర్గాలను కలిపేసే కార్యక్రమాలు మొదలయ్యాయి. కాగా టీడీపీ పార్టీ పొత్తులో భాగంగా జనసేనకు 30-40 అసెంబ్లీ సీట్లు, 5-8 పార్లమెంట్ సీట్లు ఇవ్వనుందట. అదే జరిగితే మిగతా నియోజకవర్గాల్లో పార్టీ కోసం పనిచేసిన జనసైనికులు అన్యాయం జరిగినట్లే. వాళ్ళ డబ్బు, శ్రమ వృద్దా. పవన్ మద్దతు తెలిపిన టీడీపీ అభ్యర్థి వెనుక సామాన్య కార్యకర్తల్లా జండాలు మోస్తూ తిరగాలి.
Janasena
ఇదిలా ఉంటే జనసేనకు టీడీపీ ప్రసాదించే ఆ ముప్పై నలభై సీట్లలో ఒకటి ఆదికి అంటున్నారు. మొదటి నుండి హైపర్ ఆది జనసేన సానుభూతిపరుడిగా ఉన్నాడు. నాగబాబు శిష్యుడిగా జనసేన భావజాలం ఎక్కించుకున్నాడు. బయటపడి పొలిటికల్ ట్వీట్స్ వేస్తే కెరీర్ కి ప్రమాదమని ముసుగులో కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్ మైంటైన్ చేస్తున్నారు. ద్వారా ఘాటైన పోస్ట్స్ పెడుతూ పవన్ ఫ్యాన్స్ ని సమీకరిస్తూ ఉంటాడు. ఇక పవన్ రాజకీయ ప్రత్యర్థులపై తన కామెడీ స్కిట్స్ లో సెటైర్స్ వేసే ప్రయత్నం చేస్తాడు. మొన్న రణస్థలం వేదికపై మాట్లాడే అవకాశం దక్కించుకున్నాడు.
Janasena
గొడ్డులా కష్టపడే వారి కంటే వేదికలపై జనాలు ఊగిపోయేలా మాట్లాడేవాళ్ళకే అధినేతల దగ్గర వెయిట్ ఉంటుంది. ఆ కోణంలో హైపర్ ఆది సేవలకు గుర్తుగా ఒక ఎమ్మెల్యే సీటు కేటాయించారట. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం నుండి 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాడట. ఇది లేటెస్ట్ టాక్. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రముఖంగా ప్రచారం అవుతుంది.
Janasena
దర్శి టీడీపీకి పట్టున్న నియోజకవర్గం. గత ఎన్నికల్లో కాండిడేట్ మార్పు వల్ల వైసీపీ కైవసం అయ్యింది. టీడీపీ కంచుకోటలో జనసేనకు అవకాశం ఇవ్వరు. కాబట్టి ఇది నిరాధారమైన పుకారే కావచ్చు. అయితే జనసేనకు కేటాయించిన నియోజకవర్గాల్లో ఏదో ఒక స్థానం నుండి ఎంపీగానో, ఎమ్మెల్యేగానో హైపర్ ఆది పోటీ చేయవచ్చు. జనసేన పార్టీలో పెద్ద తలకాయలు ఎవరంటే... పవన్, నాదెండ్ల, నాగబాబు. తర్వాత ఎవరంటే సామాన్య జనాలకు తెలియదు. కాబట్టి టీడీపీ ఇచ్చే ఆ ముప్పై సీట్లకు పార్టీలో పెద్దగా పోటీ ఉండకపోవచ్చు, ఎందుకంటే సాధారణ కార్యకర్తలు సీట్లు అడగరు, అడిగినా ఇవ్వరు...