- Home
- Entertainment
- యంగ్ హీరో చేతిలో భారీ ప్రాజెక్ట్స్.. ఆసక్తికరంగా మారిన కిరణ్ అబ్బవరం లైనప్.. ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్!
యంగ్ హీరో చేతిలో భారీ ప్రాజెక్ట్స్.. ఆసక్తికరంగా మారిన కిరణ్ అబ్బవరం లైనప్.. ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్!
లేటెస్ట్ సెన్సేషన్, యంగ్ హీరో కిరణ్ అబ్బవరం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఫ్యామిలీ ఆడియెన్స్ మెచ్చే కంటెంట్ తో గ్యాప్ లేకుండా సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. ఇంకో ఏడాది కూడా కిరణ్ ఇదే జోష్ చూపించబోతున్నారని తెలుస్తోంది.

టాలెంట్ ఉంటే ఏరంగంలోనైనా నిలదొక్కుకోవడం ఖాయం. సినిమా రంగంలో టాలెంట్ తో లక్ కూడా కావాల్సి ఉంటుంది. షార్ట్ ఫిల్మ్స్ నుంచి కేరీర్ ను ప్రారంభించి ప్రస్తుతం ఫుల్ ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ఒక్క హిట్ పడితే స్టార్ హీరోలను అందుకోవడం ఏమంత కష్టం కాదని అంటున్నారు. మరోవైపు హిట్ అయినా.. ఫ్లాప్ అయినా సినిమాల రిలీజ్ విషయంలో ఏమాత్రం జోష్ తగ్గడం లేదు. వరుసగా సినిమాలను రిలీజ్ చేస్తునే ఉన్నారు.
2019లో ‘రాజా వారు రాణి గారు’తో అరంగేట్రం చేసాడు కిరణ్. ఈ సినిమా మంచి హిట్ అయింది. తన నటనతో, అమాయకంతో కూడిన క్యారెక్టర్తో యువతను ఆకట్టుకున్నాడు. తర్వాత 2021లో కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ‘ఎస్.ఆర్. కల్యాణ మండపం’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో కోవిడ్ తర్వాత థియేటర్ల కు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి అతన్ని కమర్షియల్ హీరోగా పరిచయం చేసింది. ఈ సినిమాలోని తండ్రీ కొడుకుల ఎమోషన్స్కి బిసి సెంటర్స్లో, ఫ్యామిలీస్లో విపరీతమైన క్రేజ్వచ్చింది.
అదే జోష్ లో ఈ ఏడాది (2022లో) ఏకంగా మూడు చిత్రాలను రిలీజ్ చేశారు. ప్రేమకథ మరియు కమర్షియల్ సినిమా తర్వాత మూడో సినిమా కాన్సెప్ట్ బేస్డ్ థ్రిల్లర్ ‘సెబాస్టియన్ పిసి 524’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో అతను నైట్ బ్లైండ్డ్ పోలీసుగా నటించాడు, అయితే అతని కెరీర్ ప్రారంభ దశలలో ఈ ప్రయత్నం నటుడిగా ప్రశంసించబడినప్పటికీ, ఈ చిత్రం కమర్షియల్ గా హిట్ కాలేదు. ఆ తరువాత వచ్చిన ‘సమ్మతమే’ మే 24న విడుదలై విజయవంతమైంది. ఈ చిత్రం మల్టీప్లెక్స్ ప్రేక్షకులను ఆకర్షించింది. మహిళా ప్రేక్షకులను మరింతగా ఆకర్షించింది.
ఈ ట్రయల్స్లో విభిన్నమైన జోనర్లు మరియు డిసెంట్ గ్రాఫ్తో సెప్టెంబర్ 16న విడుదలైన కొత్త కమర్ ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ డిజాస్టర్గా నిలిచింది. ఇది కిరణ్ కెరీర్లో కుదుపును సృష్టించింది. అతని ప్రారంభ చిత్రాల తర్వాత ప్రేక్షకులు అతని నుండి ఎక్కువ ఆశించారు. కానీ చివరిగా వచ్చిన ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది. అయినా కిరణ్ జోష్ ఏమాత్రం తగ్గడం లేదు. హిట్టు.. ఫ్లాప్ ను బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తుండటంతో చేతినిండా సినిమాలు ఉన్నట్టు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం.. ప్రస్తుతం అతని క్రేజ్ మాత్రం అలానే ఉంది. ప్రస్తుతం కిరణ్ చేతిలో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇటీవల కిరణ్ అబ్బవరం ఒక ప్రముఖ కార్పొరేట్ ఈవెంట్కు అతిథిగానూ హాజరయ్యాడు. అలాగే మైత్రీ మూవీ మేకర్స్, గీతా ఆర్ట్స్, ఏఎమ్ రత్నం & ఏషియన్ సినిమాస్ వంటి బ్యానర్లతో త్వరలో సినిమాలు రాబోతున్నట్టు తెలుస్తున్నాయి.
ఈ ఏడాదిలాగే వచ్చే ఏడాది (2023)లోనూ కిరణ్ అబ్బవరం ఫుల్ బిజీగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. అప్ కమింగ్ ఫిల్మ్స్ లో సాలిడ్ హిట్ పడితే కిరణ్ స్టార్ లీగ్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమంటున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 17న మహాశివరాత్రి సందర్భంగా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ చిత్రం రిలీజ్ కానుంది. ఆ వెంటనే ‘మీటర్’, ‘రూల్స్ రంజన్’ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. కిరణ్ అబ్బవరం తన లైనప్ను దృష్టిలో ఉంచుకుని కెరీర్ ను మరింత బాగా ప్లాన్ చేసుకుంటున్నట్లు అర్ధమవుతుంది.