ఆ సినిమా కోసం ఐదారుగంటలు జిమ్ లోనే.. రాశీ ఖన్నా ఫిట్ నెస్ మంత్రం..?
రాశీ ఖన్నా టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్లలో ఒకరు.స్టార్ హీరోల సరసన వరుస సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. రీసెంట్ గా ఓ సినిమా కోసం ఆమె పడిన కష్టాన్ని పంచుకున్నారు.
rashi kanna
హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్నాయి రాశీ ఖన్నాకు. చేయడం అయితే సినిమాలు చేస్తుంది కాని.. పెద్దగా సక్సెస్ రేట్ లేదు. స్టార్ హీరోల పక్కన నటించే అవకావాలు లేవు. దాంతో ప్రమోగాత్మక సినిమాలు, వెబ్ సిరీస్ ల వైపు మళ్లింది బ్యూటీ. వాటి కోసం తెగ కష్టపడుతుంది కూడా.
సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా..యోధ సినిమాలో నటిస్తుంది. ఈసినిమాతో పాటు షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి, అమోల్ పాలేకర్తో కలిసి ఫర్జీ వెబ్సిరీస్క లో నటిస్తోంది బ్యూటీ. ఈ వెబ్ మూవీ కోసం తెగ కష్టపడుతుంది రాశీ ఖన్నా. వచ్చే నెల అంటే ఫిబ్రవరి 10 నుంచి ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా రాశీ కొన్ని అనుభవాలు మీడియాతో పంచుకుంది.
Rashi Khanna
ఇక తన పాత్ర గురించి మాట్లాడుతూ.. ఫర్జీబలో నా పాత్ర డిఫరెంట్ గా ఉంటుంది అన్నారు. ఫేక్ కరెన్సీ నోట్స్ కు సంబంధించిన రహస్యాలను ఛేదించే ఆఫీసర్ గా నటించాను అన్నారు. అంతే కాదు ఈ పాత్ర రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది అన్నారు రాశీ ఖన్నా.
స్క్రిప్ట్ చదివాక నకిలీ మనీ చలామణి ఇలా ఉంటుందా అని ఆశ్చర్యం కలిగింది. ఈ సిరీస్ చూశాక తెలియనివారికి చాలా సమాచారం తెలుసుకోవచ్చు. మనచుట్టూ జరుగుతున్న నేరాలపై అవగాహన కలుగుతుంది. నకిలీ కరెన్సీని కూడా చాలా సమాచారం ఇచ్చే ప్రయత్నం చేశామన్నారు.
నేను నటిస్తున్న రెండో వెబ్ సిరీస్ ఇది. రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్ సిరీస్తో నాకు మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ చేయాలి అంటే స్టామినా ఉండాలి. శారీరకంగా.. మానసికంగా స్ట్రాంగ్ గా ఉండాలి. దానికి తగ్గట్టు.. చాలా కష్టపడ్డానంటోంది రాశీ ఖన్నా. అందుకు తగ్గట్టు వ్యాయామాలు కూడా చేస్తుంటాను అన్నారు రాశీ
Rashi khanna
ఆ సమయంలో ఎంత చేస్తున్నానో కూడా తెలియకుండా కష్టపడ్డాను. జిమ్లోనే దాదాపు ఐదారు గంటలు కసరత్తులు చేస్తున్నాను. రెగ్యులర్గా అయితే బేసిక్ ఫిట్నెస్ సూత్రాలు పాటిస్తాను. కాని ఈసినిమా కోసం మనసు పెట్టి కష్టపడ్డాను అన్నారు రాశీ ఖన్నా.
Rashi khanna
ఈ సిరీస్లో షాహిద్, విజయ్ సేతుపతితో కలిసి నటించడం హ్యాపీగా అనిపించింది. హిందీ కావడంతో విజయ్ సేతుపతికి భాషా పరమైన ఇబ్బంది వస్తుందేమో అనుకున్నా కానీ, ఆయన దానిని అధిగమించిన తీరు అద్భుతం. నటుడికి భాషా భేదాలు ఉండవని నిరూపించారు. అంటూ పొగడ్తలతో ముంచెత్తింది రాశీ.
rashi khanna
మద్రాస్ కేఫ్ అనే హిందీ సినిమాతో తెరంగేట్రం చేసిన రాశీ ఖన్నా.. ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. వరుగా టాలీవుడ్ లో సినిమాలు చేసిన రాశీ.. మళ్ళీ 12 ఏళ్ళ తరువాత బాలీవుడ్ గుమ్మం తొక్కింది. ప్రస్తుతం అక్కడ బిజీ అవుతోంది.