- Home
- Entertainment
- Chiranjeevi: ఆయన్ని నమ్మి వచ్చిన హీరోయిన్, చిరంజీవి సినిమాతో ఘోర అవమానం..సెట్ లో అందరి ముందు అసభ్యంగా..
Chiranjeevi: ఆయన్ని నమ్మి వచ్చిన హీరోయిన్, చిరంజీవి సినిమాతో ఘోర అవమానం..సెట్ లో అందరి ముందు అసభ్యంగా..
చిరంజీవి, మోహన్ బాబు గతంలో ఎన్నో చిత్రాల్లో కలసి నటించారు. వాటిలో కిరాయి రౌడీలు చిత్రం కూడా ఒకటి. ఈ సినిమా విషయంలో జరిగిన ఒక సంఘటన వల్ల హీరోయిన్ కి అవమానం జరిగింది.

Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ బిగినింగ్ లో నిర్మాత క్రాంతి కుమార్ తో ఎక్కువగా సినిమాలు చేశారు. క్రాంతి కుమార్ నిర్మాతగా చిరంజీవి, మోహన్ బాబు, రాధిక ప్రధాన పాత్రల్లో 1981లో కిరాయి రౌడీలు అనే చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రానికి కోదండ రామిరెడ్డి దర్శకుడు.
స్క్రిప్ట్ లో ఆ సీన్ అంత వల్గర్ గా లేదు
తలకోన ఫారెస్ట్ ఈ చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు హీరోయిన్ రాధికకి ఘోర అవమానం ఎదురైంది. మోహన్ బాబు, రాధిక మధ్య జరిగిన అత్యాచారం సీన్ గురించి రచయిత, దర్శకుడు కానగల జయకుమార్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాధికని అత్యాచారం చేసే సీన్ అది. స్క్రిప్ట్ లో ఆ సీన్ అంత వల్గర్ గా లేదు. చాలా జాగ్రత్తగా చేయాలి అని, హీరోయిన్ కి ఎలాంటి అసౌకర్యం ఉండకూడదు అని క్రాంతి కుమార్ సూచించారు.
రాధిక ఏడుస్తూ
కానీ మోహన్ బాబు సీన్ చేసే క్రమంలో రాధిక కట్టుకున్న శారీ జారిపోయి మోహన్ బాబు చేతుల్లోకి వచ్చేసింది. అందరిముందు ఇలా జరగడంతో అవమానంతో ఆమె అక్కడే కుప్ప కూలారు. దీనితో నిర్మాత క్రాంతి కుమార్ వెంటనే కెమెరా స్విచ్ ఆఫ్ చేసి కట్ అని గట్టిగా అరిచేశారు. ఆ తర్వాత రాధిక ఏడుస్తూ పక్కకి వెళ్లిపోయారు. క్రాంతి కుమార్ మా కో డైరెక్టర్స్ అందరిపై సీరియస్ అయ్యారు. మోహన్ బాబు ఏంటి అలా చేస్తున్నారు.. మీకు సీన్ సరిగ్గా వివరించడం రాదా అని తిట్టేశారు.
ఏదో కొంపలు మునిగిపోయినట్లు
క్రాంతి కుమార్ వెళ్ళిపోయాక.. ఏంటి అంతలా అరుస్తున్నాడు ఏదో కొంపలు మునిగిపోయినట్లు అని మోహన్ బాబు అన్నారు. పొరపాటున జారిపోయింది. దానికి ఇంత గొడవ చేయాలా అని అన్నారు. రాధిక అప్పట్లో తమిళ సినిమాలు చేసేవారు. తెలుగులో కూడా నటిస్తే నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పి ఒప్పించి క్రాంతి కుమార్ ఆమెని టాలీవుడ్ కి తీసుకువచ్చారు.
క్రాంతి కుమార్ ని నమ్మి వచ్చింది
రాధిక క్రాంతి కుమార్ ని నమ్మి వచ్చింది. కాబట్టి ఆమె బాధ్యత క్రాంతి కుమార్ గారిదే. అందుకే ఆమెకి అవమానం జరిగేసరికి ఆయన సీరియస్ అయ్యారు అంటూ జయకుమార్ తెలిపారు.

