ఎంగేజ్మెంట్ అయ్యిందంటూ అనుపమ షాకింగ్ పోస్ట్...అబ్బాయి ఎవరంటున్న నెటిజెన్స్!
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఫ్యాన్స్ కి స్వీట్ షాక్ ఇచ్చారు. తనకు ఎంగేజ్మెంట్ అయిపోయిందంటూ ట్వీట్ చేయడంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.
Anupama Parameswaran
చిలిపి పోస్ట్స్ పెట్టడం హీరోయిన్స్ కి పరిపాటే. అప్పుడప్పుడు కవ్వించడానికి, కొన్ని సందర్భాల్లో చిత్ర ప్రమోషన్స్ కోసం తప్పుదోవ పట్టిస్తారు. ఆ మధ్య నిత్యా మీనన్ ఓ ప్రాజెక్ట్ ప్రమోషన్ కోసం తల్లి అయ్యానంటూ పోస్ట్స్ పెట్టింది. మొదట నిజమే అనుకున్నారు.
Anupama Parameswaran
తాజాగా అనుపమ పరమేశ్వరన్ అలాంటి షాక్ ఇచ్చారు. తనకు ఎంగేజ్మెంట్ జరిగిందని ఫోటోలు పోస్టు చేసింది. చేతి వేలికి ఓ ప్లాస్టిక్ కవర్ చుట్టుకొని ఎంగేజ్మెంట్ రింగ్ అంటూ కలరింగ్ ఇచ్చింది. అనుపమ చేసిన సరదా పని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఇదంతా ఉత్తుత్తి ఎంగేజ్మెంట్ అని తెలుసుకొని నవ్వుకుంటున్నారు.
Anupama Parameswaran
ఇక కార్తికేయ 2 తో ఒక్కసారిగా ఫార్మ్ లోకి వచ్చింది.కెరీర్ ప్రమాదంలో పడగా భారీ హిట్ తో మైలేజ్ తెచ్చుకుంది. నిఖిల్ హీరోగా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన కార్తికేయ 2 వంద కోట్ల మార్క్ దాటినట్లు ట్రేడ్ వర్గాలు రిపోర్ట్ చేశాయి. హిందీలో ఈ మూవీ విజయం సాధించడం మరో విశేషం. పెద్ద హీరోల చిత్రాలకు షాక్ ఇస్తూ కార్తికేయ 2 ఊహించిన వసూళ్లు రాబట్టింది. కార్తికేయ 2 దాదాపు రూ. 30 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ఈ విజయాన్ని టీమ్ భారీగా సెలబ్రేట్ చేసుకున్నారు .
Anupama Parameswaran
అయితే కార్తికేయ 2 అనంతరం విడుదలైన 18 పేజెస్ కమర్షియల్ గా ఆడలేదు. సుకుమార్ శిష్యుడు సూర్య ప్రతాప్ 18 పేజెస్ టైటిల్ తో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. థియేటర్స్ లో ఆడకున్నా ఓటీటీ హక్కులతో 18 పేజెస్ ప్రాఫిట్ వెంచర్ గా మిగిలినట్లు సమాచారం.
Anupama Parameswaran
కాగా బటర్ ఫ్లై టైటిల్ తో అనుపమ ఒక ఓటీటీ మూవీ చేశారు. అది కూడా నిరాశపరిచింది. కార్తికేయ 2 అనంతరం ఆమెకు రెండు ప్లాప్స్ పడ్డాయి. ప్రస్తుతం ఒక మలయాళం, ఒక తమిళ చిత్రంలో అనుపమ నటిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అనుపమ గ్లామర్ షో హద్దులు దాటేస్తుంది.