రాముడిగా ప్రభాస్.. పౌరాణిక పాత్రలో ఆదిపురుష్
రెండు సినిమాలు సెట్స్ మీద ఉండగానే మరో బిగ్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు ప్రభాస్. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్తో కలిసి సోమవారం ఓ వీడియోను రిలీజ్ చేశాడు. మంగళవారం ఉదయం ఓ బిగ్ అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నట్టుగా చెప్పి అభిమానులను ఇండస్ట్రీ వర్గాలను సస్పెన్స్లో పెట్టాడు.
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్గా మారిన ప్రభాస్ ఒక్కో సినిమాతో తన ఇమేజ్ను మరింత పెంచుకుంటూ పోతున్నాడు. సాహో సినిమాతో బాలీవుడ్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న ప్రభాస్ తరువాత సినిమాలన్నింటినీ పాన్ ఇండియా లెవల్లోనే చేస్తున్నాడు.
ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న రాధే శ్యామ్ తో పాటు నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఫాంటసీ డ్రామాను కూడా భారీ బడ్జెట్తో జాతీయ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఈ రెండు సినిమాలు తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లోనూ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
ఈ రెండు సినిమాలు సెట్స్ మీద ఉండగానే మరో బిగ్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు ప్రభాస్. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్తో కలిసి సోమవారం ఓ వీడియోను రిలీజ్ చేశాడు. మంగళవారం ఉదయం ఓ బిగ్ అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నట్టుగా చెప్పి అభిమానులను ఇండస్ట్రీ వర్గాలను సస్పెన్స్లో పెట్టాడు.
అయితే ఎనౌన్స్మెంట్ ఎంటంటే ప్రభాస్ త్వరలో ఓ పౌరాణిక పాత్రలో నటించనున్నాడు. ఆదిపురుష్ పేరుతో ఓం రౌత్ తెరకెక్కిస్తున్న సినిమాలో ప్రభాస్ రాముడిగా నటించనున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన ఎనౌన్స్ మెంట్ వచ్చేసింది. ప్రీలుక్ పోస్టర్తో సినిమాను ప్రకటించారు చిత్రయూనిట్. టీ సీరిస్ సంస్థ ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మించనుంది.