Gunturkaaram 3 days Collections.. `గుంటూరు కారం` కలెక్షన్లలో ఊహించని ట్విస్ట్.. ఇది మహేష్ మ్యాజికేనా?
మహేష్బాబు `గుంటూరు కారం` ఈ సంక్రాంతికి వచ్చి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. కలెక్షన్లు మాత్రం బాగానే వస్తున్నాయి. భారీ పోటీ, బీభత్సమైన నెగటివిటీ మధ్య ఈ సినిమా మంచి కలెక్షన్లని రాబడుతుండటం విశేషం.
సూపర్ స్టార్ మహేష్బాబు ఈ సంక్రాంతికి `గుంటూరు కారం` చిత్రంతో సందడి చేశారు. శుక్రవారం విడుదలైన ఈ మూవీకి తొలుత భారీగా నెగటివ్ టాక్ వచ్చింది. చాలా వరకు నెగటివ్ టాక్ని స్ప్రెడ్ అయ్యింది. వాంటెడ్గా దీనిపై నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేసినట్టు తెలుస్తుంది. ఇతర హీరోల ఫ్యాన్స్ ఈ మూవీపై బాగా నెగటివ్ టాక్ని విస్తరించారు. దీంతో సినిమాపై బాగా ప్రభావం పడింది. రెండో రోజు కలెక్షన్లు తగ్గడానికి కారణమయ్యింది.
![article_image2](https://static-ai.asianetnews.com/images/01hm64p7w4a8fjg81k1bq8rkzq/f4605c7c-7ae6-4e0e-b9ab-def4a616eaaf-jpg_300x424xt.jpg)
ఇదిలా ఉంటే ఈ మూవీ భారీ నెగటివ్ టాక్ మధ్య మొదటి రోజు 94కోట్లు గ్రాస్ వసూలు చేసింది. రెండో రోజు 33కోట్లు వచ్చాయి. ఇప్పుడు మూడో రోజు 37కోట్లు రాబట్టింది. ఇక పూర్తిగా మూడు రోజుల్లో ఈ మూవీ 164కోట్ల గ్రాస్ చేసింది. ఎనభై కోట్లకుపైగా షేర్ రాబట్టడం విశేషం. ఇక ఈ మూవీ 132 కోట్ల బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా యాభై కోట్ల వరకు షేర్ రావాలి. అంటే వందకోట్లు వసూలు చేయాలి.
ఇదిలా ఉంటే రెండో రోజు కంటే మూడో రోజు కలెక్షన్లు పెరగడం ఆశ్చర్యపరుస్తుంది. ఆదివారం కొత్తగా `నా సామిరంగ` మూవీ విడుదలైంది. వాస్తవానికి కలెక్షన్లు తగ్గాలి. కానీ పెరిగాయి. ఇప్పుడు మరింతగా పెరుగుతున్నాయట. దీంతో ఈ సినిమా పాజిటివ్ టాక్ పెరుగుతున్నట్టు తెలుస్తుంది. టాక్ ఏదేమైనా ఈ మూవీ పండగ రోజుల్లో కొదవలేదు.
మహేష్బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో `గుంటూరు కారం` చిత్రం వచ్చింది. చాలా గ్యాప్తో ఈ కాంబో రిపీట్ అయ్యింది. గతంలో `అతడు`, `ఖలేజా` చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటించింది. మీనాక్షి చౌదరి చిన్న పాత్రలో మెరిసింది. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, రావు రమేష్, రాహుల్ రవీంద్రన్ ఇతర పాత్రల్లో మెరిశారు.
మదర్ సెంటిమెంట్తో ఈ మూవీని తెరకెక్కించారు త్రివిక్రమ్. రమ్యకృష్ణ చిన్నప్పుడు కొడుకుని వదలేసి తండ్రి వద్దకు వస్తుంది. తండ్రి కోరిక మేరకు ఆయన చూపించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని రాజకీయాల్లో ఎదుగుతుంది. మంత్రి అవుతుంది. రాష్ట్ర రాజకీయాలను శాషిస్తుంది. ఈ నేపథ్యంలో తండ్రి కోసం ఆమె ఏం చేసింది, దూరమైన తల్లి కోసం మహేష్ ఏం చేశారనేది కథ. తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటించడం విశేషం. ఈ మూవీని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ(చినబాబు) నిర్మించారు.