'గుంటూరు కారం'పై బుక్ మై షో కుట్ర.. నిజంగా అంత దారుణం చేశారా ? లేక నెగిటివ్ పబ్లిసిటీ ?
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రం జనవరి 12 నుంచి థియేటర్స్ లో సందడి చేస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు హ్యాట్రిక్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాలతో సంక్రాంతికి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రం జనవరి 12 నుంచి థియేటర్స్ లో సందడి చేస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు హ్యాట్రిక్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాలతో సంక్రాంతికి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే అంచనాలని ఈ చిత్రం పూర్తి స్థాయిలో అందుకోలేకపోయింది.
![article_image2](https://static-ai.asianetnews.com/images/01hm617dfxntst1qbhnf0vx67j/Mahesh-Babu3-1705304634877_300x399xt.jpg)
తొలి షో నుంచి గుంటూరు కారంపై మిక్స్డ్ రిపోర్ట్స్ మొదలయ్యాయి. అయితే మహేష్ స్టామినాతో వసూళ్లు పర్వాలేదనిపించే విధంగా వస్తున్నాయి. సంక్రాంతి సెలవులు ముగిసిన తర్వాత ఈ చిత్రానికి అసలు పరీక్ష మొదలవుతుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
అయితే గుంటూరు కారం చిత్రం విషయంలో మారో కొత్త వివాదం మొదలయింది. ఆ వివాదం ఏంటంటే బుక్ మై షోలో రేటింగ్. బుక్ మై షోలో పాజిటివ్ రిపోర్ట్స్ ఉన్న చిత్రానికి ఎక్కువ రేటింగ్.. నెగిటివ్, మిక్స్డ్ టాక్ ఉన్న చిత్రానికి తక్కువ రేటింగ్ ఉండడం సహజం.గుంటూరు కారం చిత్రానికి మరీ దారుణంగా బుక్ మై షోలో 6.6 రేటింగ్ చూపిస్తోంది.
బుక్ మై షోలో గుంటూరు కారం చిత్రానికి చూపిస్తున్న ఈ రేటింగ్ తో చిత్ర యూనిట్ తీవ్ర అసంతృప్తిగా ఉంది. బుక్ మై షో కావాలనే కుట్ర చేసి అంత తక్కువ రేటింగ్ వచ్చేలా చేశారని హారిక అండ్ హాసిని సంస్థ ఆరోపిస్తోంది. దీనిపై సైబర్ క్రైమ్ ని కూడా ఆశ్రయిస్తామని మేకర్స్ చెబుతున్నారు. చిత్ర యూనిట్ చేస్తున్న ఆరోపణ ఏంటంటే.. బాట్ టెక్నాలజీతో ఫేక్ ఓటింగ్ ద్వారా గుంటూరు కారం చిత్రానికి వ్యతిరేకంగా 70 వేల ఓట్లు వేశారట. అందువల్లే అంత తక్కువ రేటింగ్ చూపిస్తోందని చిత్ర యూనిట్ చెబుతోంది.
అయితే పని గట్టుకుని గుంటూరు కారం చిత్రాన్ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంది ? నిజంగా ఎవరైనా ఇలా చేస్తారా అనే ప్రశ్న తలెత్తుతోంది. బుక్ మై షో పై గుంటూరు కారం చిత్ర యూనిట్ కి అనుమానాలు ఉంటే తేల్చుకోవచ్చు కానీ.. మరీ సైబర్ క్రైం కి ఫిర్యాదు చేస్తాం అంటూ చెప్పడం నెగిటివ్ పబ్లిసిటీ కోసం పాకులాడుతున్నట్లు ఉందని కొందరు ట్రోల్ చేస్తున్నారు.
గుంటూరు కారం చిత్రానికి ప్రస్తుతానికి మంచి వసూళ్లే వస్తున్నాయి. సినిమాలో ఉన్న పాజిటివ్ అంశాలు చెప్పి ప్రేక్షకులని థియేటర్స్ కి రాబట్టుకోవడం మంచి పద్ధతి. కానీ ఇలా రేటింగ్స్ ని సాకుగా చూపించి పబ్లిసిటీ పొందాలని చూస్తే అది బెడిసి కొట్టే అవకాశాలు లేకపోలేదని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ అభిమానుల అంచనాలకు తగ్గట్లుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించలేదన్నది వాస్తవం. శ్రీలీల క్రేజ్ ని వాడుకుంటే స్టెప్పులేయించి, మహేష్ పాత్రని మాస్ గా ప్రెజెంట్ చేసి సరిపెట్టేశారు. త్రివిక్రమ్ ఒకే తరహాలో తల్లి కొడుకు, తండ్రి కొడుకు సెంటిమెంట్ తో సినిమాలు చేస్తున్నారని నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.