16 కోట్ల ఫ్లాట్ తీసుకొని.. డిన్నర్ బిల్లు కట్టమంటే.. బ్రేకప్ చెప్పేసిందా నటి!
విజయ్ మాల్యా తనయుడు సిద్ధార్థ్ మాల్యా, బాలీవుడ్ క్రేజీ బ్యూటీ దీపిక పదుకొనేల ప్రేమ వ్యవహారం బహిరంగ రహస్యమే. రణబీర్ కపూర్తో బ్రేకప్ తరువాత చాలా కాలం సిద్ధార్థ్తో కలిసి కనిపించింది దీపిక. అంతేకాదు రాయల్ చాలెంజర్స్ గేమ్ సందర్భంగా సిద్దార్థ్, దీపికకు పబ్లిక్గా లిప్ లాక్ ఇవ్వటం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. అయితే చెట్టాపట్టాలేసుకొని తిరిగిన ఈ క్రేజీ జంట ఓ చిన్న కారణంతో విడిపోయిందట.
బాలీవుడ్ నటి దీపికా పుదుకొనేను ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ సిద్ధార్థ్ మాల్యా ఓ రాణీలా చూసుకునేవాడట. దీపికకు సిద్దార్థ్ రెగ్యులర్గా ఖరీదైన గిఫ్ట్లు ఇచ్చేవాడట.
దీపికకు 16 కోట్ల విలువైన ఫ్లాట్తో పాటు వజ్రాలు, ప్లాటినం నగలు ఇచ్చాడు సిద్దార్థ్.
అంతేకాదు సిద్ధార్థ్ తండ్రి విజయ్ మాల్యా కూడా దీపికకు గిఫ్ట్లు ఇచ్చాడు. ఆమెకు భారీ పారితోషికం ఇచ్చి యూబీ గ్రూప్కు బ్రాండ్ అంబాసిడర్గా చేశాడు మాల్యా.
మాల్యా గ్రూప్ నుంచి వచ్చే కింగ్ ఫిషర్ క్యాలెండర్ ద్వారా గ్లామర్ ఫీల్డ్లోకి అడుగు పెట్టింది దీపిక.
అయితే కింగ్ ఫిషర్ ప్రమోటర్ ఉన్న సమయంలో సిద్ధార్థ్తో దీపికకు పెద్దగా సంబంధం లేదు. కానీ రణబీర్తో బ్రేకప్ తరువాత ఈ యంగ్ బిజినెస్మేన్కు దగ్గరైంది దీపిక.
రణబీర్తో బ్రేకప్ తరువాత తరుచూ సిద్ధార్థ్తో కలిసి కనిపించేది దీపిక. ముంబై పేజ్ 3 పార్టీస్లో ఈ జంట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
సిద్ధార్థ్ ఖరీదైన బహుమతులతో ఎప్పటికప్పుడు దీపికను ఆకట్టుకునేందుకు ప్రయత్నించేవాడు. కానీ వారి బంధం ఎక్కువ కాలం నిలవలేదు.
ఒక రోజు డిన్నర్ డేట్లో దీపికను సిద్దార్థ్ బిల్లు కట్టమనటంతో వీరిద్దరి మధ్య గొడవ జరిగింది.
ఆ చిన్న కారణంతోనే సిద్దార్థ్కు బ్రేకప్ చెప్పేసింది దీపిక పదుకొనే.
దీపిక ఓ వెర్రి అమ్మాయి అంటూ కామెంట్ చేశాడు సిద్ధార్థ్ మాల్యా. ఓ చిన్న కారణంతో దీపిక తనను వదిలిపెట్టిందని చెప్పాడు సిద్ధార్థ్.
`దీపిక అన్నీ మర్చిపోయింది. నేను ఆమెకు ఖరీదైన నగలు, వజ్రాలు, బ్యాగ్లు గిఫ్ట్ ఇచ్చాను. ఆమె మీద నేను కోట్లు ఖర్చు పెట్టాను. ఆమె స్నేహితుల కోసం కూడా నేను పార్టీలు ఇచ్చాను` అని చెప్పాడు సిద్ధార్థ్.
ప్రస్తుతం దీపిక బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ను పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది.