జైలులో రియా మొదటి రోజు ఎలా గడిపింది?
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసు పూర్తిగా రియా చక్రవర్తి మెడకు చుట్టుకుంది. ముఖ్యంగా డ్రగ్స్ డీల్పై మూడు రోజుల పాటు విచారించిన ఎన్సీబీ పోలీసులు మూడో రోజున ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించటంతో ఆమెను ముంబైలోని బైకుల్లా జైలుకు తరలించారు.
మూడు రోజుల విచారణ అనంతరం ఎన్సీబీ అధికారులు రియాను అదుపులోకి తీసుకున్నారు. ఆ రోజు రాత్రంతా ఆమె ఎన్సీబీ కార్యాలయంలోనే గడిపింది. రాత్రంత నిద్రపోకుండా ఏదో ఆలోచిస్తూ గడిపింది.
మరుసటి రోజు రియాను బైకుల్లా జైలుకు తరలించారు. కోర్టు ఆమె 14 రోజుల రిమాండ్ విధించింది. ఆమె పెట్టుకున్న బెయిల్ పిటీషన్ను కూడా కోర్టు కొట్టివేసింది. దీంతో ఆమెను కరుడుగట్టిన నేరస్థులతో కలిపి ఉంచారు.
ముంబైలో ఉన్న ఏకైక మహిళా జైలు బైకుల్లా. ముంబైలోని మీర్జా గాలిబ్ రోడ్లోని న్యూ నాగ్పారాలో ఈ జైలు ఉంది. షినా బోరా హత్య కేసులో నింధితురాలిగా ఉన్న ఇంద్రాణి ముఖర్జీ కూడా అదే జైలులో ఉన్నారు.
రియాను జైలులోని సెల్ నంబర్ 1 గదిలో ఉంచారు. ఈ గదికి మూడు వైపుల గోడ ఓ వైపు పూర్తిగా గ్రిల్ ఉన్నట్టుగా అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది.
బైకుల్లా జైలు వర్గాల సమాచారం ప్రకారం, మధ్యాహ్నం రెండు రొట్టెలు, ఒక గిన్నె బియ్యం, ఒక గిన్నె పప్పు మరియు కూర ఆమె భోజనంలో ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
రియా ఇంట్లో తినే భోజనానికి, జైలులో పెట్టే భోజనానికి చాలా తేడా ఉంటుంది. ఆమె ఆ భోజనాన్ని అలవాటు చేసుకోగలదా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
మామూలు రోజుల్లో రియా ఉదయాన్ని కొబ్బరినీళ్లు తాగుతుంది. టిఫిన్లో పోహా, ఉప్మా, దోశలలో ఏదో ఒక వైరటి తింటుంది. షూటింగ్ ఉన్న సమయంలో పండ్లు, డ్రై ఫ్రూట్స్ లాంటివి తింటుంది. మధ్యాహ్నం అన్నం, పప్పు, కూరగాయల భోజనం, రాత్రికి స్మూతీలు తినటం రియాకు అలవాటు.
జైలులో మొదటి రోజు రాత్రి పడుకోడగానికి చాపా, దుప్పటి మాత్రమే ఇచ్చారు.
బైకుల్లా జైలులో ప్రత్యేకంగా క్యాంటిన్ను కూడా ఏర్పాటు చేశారు, అందులో బిస్కెట్లు ఇతర అవసరాలకు సంబంధించిన వస్తువులను మమిళా ఖైదీలు కొనుక్కోవచ్చు.
ప్రస్తుతం బైకుల్లా జైలులో 251 మంది మహిళా ఖైదీలు ఉన్నారు.
ఇప్పటికే సుశాంత్ కేసులో రియా సోదరుడు షోవిక్, సుశాంత్ మాజీ సహాయకుడు శామ్యూల్ మెరిండాలు కూడా అరెస్ట్ అయ్యారు.